credit card careful : కరెంట్,వాటర్,గ్యాస్ బిల్స్ క్రెడిట్ కార్డుతో కడుతున్నారా..? అయితే జాగ్రత్త...
క్రెడిట్ కార్డుతో ఎన్నో రకాల ట్రాన్సక్షన్ల చేస్తున్నారు.అయితే కొన్ని కేట గిరీలకు చెందిన ట్రాన్సాక్షన్ల పై ఎక్కువ చార్జీలు పడే అవకాశాలు ఉన్నాయని క్రెడిట్ కార్డు యూజర్లు గుర్తుంచుకోవలసి ఉంటుంది. ఈ తరుణంలో దేశీయ దిగ్గజ ప్రైవేట్ బ్యాంకుల జాబితాలో ముందు వరుసలో ఉన్న యెస్ బ్యాంక్,ఐడిఎఫ్ సి బ్యాంకులు తమ క్రెడిట్ కార్డును ఉపయోగించేవారి కి షాక్ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది.

యుటిలిటీ ట్రాన్సాక్షన్ల పై సర్ చార్జీలను తీసుకొచ్చింది. అంటే కరెంట్, వాటర్, గ్యాస్, ఫోన్ బిల్లు, ఇంటర్నెట్ సర్వీసెస్, కేబుల్ సర్వీసెస్ వంటి బిల్లులు కట్టినట్లయితే వాటిపై ఎక్కువ సర్ చార్జీలు విధిస్తున్నారు. ఈ సర్జీలు మే1,2024 నుండి అమలులోకి వస్తున్నట్లుగా బ్యాంకు వారు తెలిపారు. ఇంకోవైపు గత కొద్ది నెలలుగా చూసినట్లయితే చాలా బ్యాంకులు తమ క్రెడిట్ కార్డ్ యూజర్లకు పలు బెనిఫిట్స్ తొలగించారు.
యెస్ బ్యాంకు క్రెడిట్ యూజర్లు యుటిలిటీ బిల్ పేమెంట్ చేస్తే వారి బిల్లు అమౌంట్ రూ.15,000 దాటింది. ఈ క్రమంలో 1 శాతం సర్ చార్జి ప్లస్ డిఎస్ టి పై ఎక్కువ అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే యెస్ బ్యాంకు ప్రైవేట్ క్రెడిట్ కార్డుకు ఈ యుటిలిటీ సర్ చార్జ్ లు వర్తించవు. అంతే మీ క్రెడిట్ కార్డు తో చేసే యుటిలిటీ అనగా ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్,ఇంటర్నెట్ బిల్లు మొత్తం కూడా రూ.15,000 కన్న తక్కువగా ఉన్నట్లయితే ఎటువంటి సర్ చార్జీలు కట్టే అవసరం లేదు.
ఒకవేళ ఈ లిమిట్ గనుక దాటినట్లయితే అప్పుడు 1 శాతం సర్ చార్జీ ప్లస్ 18 శాతం జిఎస్ టి కట్టాల్సి ఉంటుంది.. ఐడిఎఫ్ సి బ్యాంకు విషయానికి వచ్చినట్లయితే యుటిలిటీ బిల్స్ 20000 దాటితే ఆ టైంలో 1 శాతం సర్ చార్జీ ప్లేస్ జిఎస్ టి పడే అవకాశం ఉంది. అంతే ఫస్ట్ ప్రైవేట్ క్రెడిట్ కార్డు, ఎల్ఐసి సెలెక్ట్ క్రెడిట్ కార్డు, ఎల్ఐసి క్లాసిక్ క్రెడిట్ కార్డు లకు ఈ సర్ చార్జీలు వర్తించవు అని తెలిపింది.
ఆయా క్రెడిట్ కార్డులు కాకుండా వేరే క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్న వారు యుటిలిటీ బిల్ పేమెంట్ చేసినప్పుడు జాగ్రత్తగా వ్యవహరించలి అని తెలిపింది. రూ.20వేలు దాటినట్లయితే 1 శాతం సర్ చార్జీ ప్లస్ 18 జిఎస్ టి కట్టవలసి ఉంటుంది..