Reduced air pollution in hyderabad : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. గణనీయంగా తగ్గిన వాయు కాలుష్యం.. దానికి కారణం ఇదే ...

Reduced air pollution in hyderabad  : హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. గణనీయంగా తగ్గిన వాయు కాలుష్యం.. దానికి కారణం ఇదే ...

Reduced air pollution in hyderabad :  హైదరాబాదుకి మరో పేరు భాగ్యనగరం. ఈ నగరం హస్తకళలకు, నాట్యానికి ప్రసిద్ధి. హైదరాబాద్ భారత దేశంలో 5వ అతిపెద్ద మహానగరం. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఒక జిల్లా. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇది అతి చిన్నది కానీ అత్యధిక మానవ సాంద్రత కలిగి ఉంది. అంతేకాదు హైదరాబాద్ చుట్టుపక్కల మున్సిపాలిటీలను కలుపుకుపోతే ప్రపంచంలో మహా నగరాల్లో 41 స్థానంలో ఉంది.

ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం కూడా. హైదరాబాద్ భారత దేశంలో అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటి. అంతేకాక సాఫ్ట్ వేర్ రంగంలో కూడా ఇది ఎంతగానో అభివృద్ధి చెందింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలుగా ప్రసిద్ధి చెందాయి. అయితే జనసాంద్రత ఎక్కువగా ఉన్న ఈ మహానగరంలో వాయు కాలుష్యం ఎక్కువ. హైదరాబాదులో ఇప్పటికే వాయు కాలుష్యం పెరిగిపోయిందని మరో ఢిల్లీ అయ్యే అవకాశం ఉందని పలు సంస్థలు భయపెట్టాయి.

కానీ హైదరాబాదులో చాలావరకు వాయు కాలుష్యం తగ్గింది అని ఓ అంతర్జాతీయ సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. హైదరాబాద్ సహా పలు నగరాల్లో, పట్టణాల్లో కాలుష్యం తగ్గింది. అయితే లాక్ డౌన్ ఎత్తేసాక వాహనాల రాకపోకలు పరిశ్రమలు ఉత్పత్తి తగ్గింది. లాక్ డౌన్ వల్ల కూడా వాయు కాలుష్యం చాలా వరకు తగ్గిందని చెప్పవువచ్చు. నగరాల్లో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకలు  తెలియజేశాయి..

pollution

 

 హైదరాబాద్ వాసులకు ఊపిరి పీల్చుకునే ఒక వాస్తవం వినిపిస్తుంది. దుమ్ము, కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అయ్యే నగరవాసులకు ఒక ఊరటం ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం చాలా వరకు తగ్గింది అని ఓ అంతర్జాతీయ సంస్థ తెలిపింది. మార్గదర్శకాల ప్రకారం వివిధ నగరాల్లో వాయు కాలుష్యం పై స్విట్జర్లాండ్ కేంద్రంగా ఉన్న ఐక్యూ ఎయిర్ సంస్థ ఇటీవలే ఒక అధ్యయనం నిర్వహించింది.

ఆ అధ్యయనం ప్రకారం హైదరాబాద్ తో పాటు శివార్లలోని సంగారెడ్డి, పారిశ్రామిక సంస్థలు ఉన్న పటాన్ చెరువులో కూడా వాయు కాలుష్యం గతంతో పోలిస్తే ఇప్పుడు గణనీయంగా తగ్గినట్టు నివేదికలో పేర్కొంది. ఐక్యు ఎయిర్ సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం వాయు కాలుష్యం..హైదరాబాదులో 2019-20లో పీఎం-10,101 ఉండగా, 2022- 23 లో 87గా నమోదయింది, అయితే 2023 24 సంవత్సరంలో 83 గా నమోదయినట్లు ఈ సంస్థ తెలిపింది.

నగరంతో పాటు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో కూడా వాయు కాలుష్యం గత సంవత్సరంతో పోలిస్తే చాలావరకు తగ్గిందని ఈ సంస్థ తెలిపింది. ఇంకో వైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ GHMC పరిధిలో వాయు కాలుష్య రహదారి దుమ్ము 32 శాతం, వాహనాల కాలుష్యం 18 శాతంగా ఉంది అని  ఈ నివేదిక తెలిపింది.

అంతేకాక నగరాల్లో ఈ భారీ మార్పులకు కారణాలు ఏమిటి అనగా GHMC పరిధిలోTS, RTC బస్సులు డీజిల్ కి బదులుగా వీలైనన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఉపయోగిస్తున్నారు. ప్రధాన రహదారులు దాటేందుకు పాదాచారులు ఉపయోగించడానికి ట్రాఫిక్  ఫెలికాల్ సిగ్నల్స్ ను ఏర్పాటు చేశాటం,ట్రాఫిక్ ను బట్టి ఆటోమేటిక్ గా మారే అడాప్టింగ్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టం.ఈ ప్రధాన కారణాలని  తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?