Atmosphere: అసలు ఏంటి ఈ వాతావరణం?.. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఇదే?

Atmosphere: అసలు ఏంటి ఈ వాతావరణం?.. శాస్త్రవేత్తలు చెబుతున్నది ఇదే?

Atmosphere:  ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క చోట కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారతదేశం అంతటా కూడా  విపరీతంగా వానలు పడుతున్నాయి. అయితే ఇందులో మరికొన్నిచోట్ల భారీ ఎండలు కూడా కాస్తూ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రకాశం జిల్లాలో నాలుగు రోజులు భారీ వర్షాలు కురిసి మళ్ళీ ఒకరోజు భారీ ఎండ కాసి మళ్ళీ వర్షాలు పడుతున్నాయి. ఇలాంటి వాతావరణ మార్పులు ఎందుకు వస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

 ప్రధానంగా ఇప్పటి కాలంలో వాతావరణం  అనేది తీవ్ర ప్రభావం చూపుతుంది. కొంచెం సేపు వర్షపాతం మరికొంచెం సేపు భారీ ఉష్ణోగ్రతతో ప్రజలు కూడా విలవిలలాడిపోతూ ఉన్నారు. అంతేకాకుండా ఏకంగా రైతులయితే తీవ్రంగా ఇబ్బందులు కూడా పడుతూ ఉన్నారు. పంట చేతికి వచ్చే సమయంలో  వర్షాలు పడుతున్నాయి. అలాగే పంటలు వేసే సమయంలో  వర్షాలు పడకపోవడం తొ పాటు చాలా మంది రైతులు తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. 

ధీంతో రైతులు చాలా మంది ఈ రోజుల్లో మరణిస్తున్న సందర్భాలు మనం చాలానే చూసి ఉంటాం. అయితే దీనికి కారణం మనమే. మనం చేస్తున్న ప్రకృతి విపత్తుల వల్లే ఇలాంటి ప్రభావితాలు కనబడుతున్నాయ ని కొంతమంది వాతావరణ శాఖ అధికారులు అలాగే శాస్త్రవేత్తలు కూడా చెబుతున్న సందర్భాలు మనం చాలానే చూశాం.

2203
 అయితే ప్రస్తుతం భారత్ లో  వాతావరణ సంస్థ రుతుపవనాలపై అధ్యయనం చేయడం మొదలుపెట్టింది. ఇందులో చాలానే చెప్పుకొచ్చారు వీళ్ళు. ఋతుపవనాల సీజన్లో స్పష్టమైన మార్పులు కనిపించాయని ఈ క్లైమేట్ సంస్థ చెప్పుకొచ్చింది. ఈ యొక్క వాతావరణ మార్పులు అనేవి వర్షాలు పడేటువంటి స్థితిగతులను పూర్తిగా మార్చినట్లు వెల్లడించారు. తద్వారా మనకి పడాల్సిన చోట వర్షాలు అనేవి భారీ ఎత్తున పడుతున్న మరోచోట అసలు వర్షాలు పడకుండా విపరీతంగా ఎండలు కాస్తూ ఉన్నాయి. వీటన్నిటికి కూడా వాతావరణ ప్రకృతినే కారణమని  వీళ్లు చెప్పకొచ్చారు. 

 దేశవ్యాప్తంగా ప్రస్తుతం క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ 729 జిల్లాలలో అధ్యయనం అనేది చేసింది. అయితే ఇందులో దాదాపుగా చాలా జిల్లాల్లో వర్షపాతం లో వైవిధ్యం కనిపించిందని ఈ సంస్థ వెల్లడించింది. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఆందోళనకు గురవుతున్నారు. ఈ సర్వేలో భాగంగా 340 జిల్లాల్లో  సాధారణ వర్షపాతం నమోదు అయిందని చెప్పుకొచ్చారు.

 158 జిల్లాల్లో భారీ వర్షాలు అలాగే 48 జిల్లాలలో అతి భారీ వర్షాలు పడి ప్రజలకు కొంతమేర నష్టం కలిగించాయని చెప్పారు. 178 జిల్లాలో అతి తక్కువ వర్షపాతం నమోదు అయిందని అలాగే 11 జిల్లాల్లో అసలు వర్షమే పడలేదని ఈ నివేదిక వెల్లడించింది. దీన్నిబట్టి చూస్తే మనం దేశమంతటి కూడా వివిధ వాతావరణ పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని అర్థమవుతుంది. అయితే వీటన్నిటికి కూడా ప్రకృతి వల్లనే ఈ వాతావరణ పరిస్థితులు ప్రభావితం చెందాయని కొంతమంది శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

2202
 అలాగే గత ఐదేళ్ల కన్నా ఈ ఏడాదిలో చాలా మార్పులు సంభవించాయని ఈ  క్లైమేట్ ట్రెండ్స్ సంస్థ వెల్లడించింది. చాలా సందర్భాల్లో పడాల్సిన వర్షం కన్నా అధిక వర్షాలు పడ్డాయని వెల్లడించారు. అంతేకాకుండా వీటన్నింటికి కూడా వాతావరణ పరిస్థితులు కారణమని  చెప్పుకొచ్చారు. ఇలాంటి సందర్భంలో భారీ వరదలు అలాగే భారీగా నష్టం కూడా వాటిల్లింది చెప్పకువచ్చారు. ఈ ఒక్క ఏడాదిలోనే 753 వాతావరణ కేంద్రాల్లో అత్యధిక వర్షపాతం నమోదు అయిందని చెప్పుకొచ్చారు. 2020 తర్వాత ఇది అత్యధికమని చెప్పారు. 

 భూమి ఉపరితల మరియు సముద్ర గర్భంలోని  ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాచారం ఉండడమే ఈ వాతావరణం ప్రభావితం చెందిందని చెప్పుకోవచ్చారు. సముద్ర గర్భంతో పోలిస్తే భూమిపై ఎక్కువగా ఉష్ణోగ్రతలనేవి మారిపోతూ ఉంటాయి. ఇలా వాతావరణం మార్పులు వల్ల అలాగే క్రమంగా ఉష్ణోగ్రతలనేవి అటు ఇటు మారిపోవడం వల్ల  ఋతుపవనాలు సైతం గతి తప్పుతున్నాయి. దీనివల్ల కురవాల్సిన చోట వర్షం పడకుండా అలాగే పడాల్సిన చోట  అత్యధికంగా వర్షపాతం అనేది పడడం వల్ల  అన్ని రంగాలలో ఉన్నటువంటి వారు కూడా చాలాసార్లు ఇబ్బంది పడ్డారు. 

 ఇకపోతే 2023లో కరువు పరిస్థితులనేవి ఏర్పడిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఏడాదిలోని మళ్లీ ఇంతటి భారీ వర్షాలు నమోదు అవ్వడం  అందరిలోనూ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. సాధారణంగా వాతావరణం  అలాగే ఋతుపవనాలపై ఆధారపడి వ్యవసాయదారులు చాలామంది ఉన్న సంగతి మనకు తెలిసిందే. కాబట్టి రుతుపవనాలు పూర్తిగా గజ తప్పితే ఊహించని పరిణామాలు ఏర్పడతాయని క్లైమేట్ ట్రెండ్స్  సంస్థ వ్యవస్థాపకరాలు తెలిపారు. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?