TS Jenko: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, క్విక్ టుడే : గత ఐదు రోజులుగా కే టి పి పి (కాకతీయ ధర్మల్ పవర్ ప్రాజెక్టు) - చెల్పూర్ లో జరిగిన టీఎస్ జెన్కో ఇంటర్ ప్రాజెక్టు క్రికెట్ టోర్నమెంట్ లో మణుగూరు కు చెందిన భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ క్రీడా కారులు ఉత్తమ ప్రదర్శన కనబరిచి తృతీయ స్థానం కూలర్స్ బహుమతుల ను పొందారు. ఈ సందర్భంగా బి టి పి ఎస్ చీఫ్ ఇంజనీర్ బి బిచ్చన్న గెలుపొందిన క్రీడాకారులను అభినందించారు. అలాగే క్రీడాకారులను బి టి పి ఎస్ సిఇ డబ్ల్యూఓ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బిచ్చన్న క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ సంస్థ క్రీడాకారులను ఎప్పటికి ప్రోత్సహిస్తూ ఉంటుందని, క్రీడలను, క్రీడారంగాన్ని, సాంస్కృతిక రంగాన్ని సమానంగా చూస్తూ కార్మికుల ప్రాథమిక అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా సంస్థ పనిచేస్తుందని తెలిపారు.
అలాగే కార్మికులు కూడా సంస్థ అభివృద్ధికి కష్టపడి పనిచేసి దేశంలోకెల్ల ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిపే దిశగా పాటుపడాలని కోరారు. సంస్థ అభివృద్ధి మన అభివృద్ధి అని కార్మికులు క్రమశిక్షణ, అంకితభావంతో పని చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ సెక్రటరీ కత్తి నరసింహారావు, అకౌంటెంట్ బాబురావు, డి ఇ లు సత్యనారాయాణ, మోకళ్ళి కృష్ణ, జట్టు సభ్యులు ఉదయ్ కిరణ్ ,అశోక్ రెడ్డి ,. రమేష్, గోపాలకృష్ణ, ప్రేమ్, సంపత్, తిరుపతి, ప్రవీణ్, భరత్, నవీన్, రవి, మేనేజర్ . నాగేశ్వరరావు,. సత్యనారాయణ, రాజుబాబు, రాయ్ సాబ్, గని, సురేష్ ,సతిష్ రెడ్డి, మహేష్, లు పాల్గొన్నారు.