IPL 2024 : ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న కెప్టెన్లు వీరే.. కెప్టెన్సీ ధోనీ స్థానంలో ఎవ‌రు వ‌స్తున్నారో తెలుసా? 

IPL 2024 : ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న కెప్టెన్లు వీరే.. కెప్టెన్సీ ధోనీ స్థానంలో ఎవ‌రు వ‌స్తున్నారో తెలుసా? 

క్రికెట్ అభిమానుల‌కు ఐపీఎల్ సీజ‌న్ 2024 మ‌రికొద్ది రోజుల్లోనే రాబోతోంది. మార్చి 22 నుంచి ఈ లీగ్ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. చెన్నై సూప‌ర్ కింగ్స్‌, బెంగ‌ళూరు రాయ‌ల్ చాలెంజ‌ర్స్ మ‌ధ్య తొలి క్రీడ జ‌రుగ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్ 10 జ‌ట్ల కెప్టెన్లు పారితోషికం ఎంతెంత మొత్తంలో తీసుకుంటున్నారో తెలుసుకుందాం.. చెన్నై సూప‌ర్ కింగ్ జ‌ట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రూ.12 కోట్ల‌ను పారితోష‌కంగా తీసుకుంటున్నారు. అయితే ఈసారి సీఎస్‌కే సార‌ధ్య బాధ్య‌త‌లను రుతురాజ్ గైక్వాడ్‌కు దోని అప్ప‌గించ‌నున్న‌ట్లు వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజూశాంస‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఐపీఎల్ లో అతడికి ఏడాదికి రూ.14 కోట్లు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ చెల్లిస్తోంది.
 పంజాబ్ కింగ్స్ జ‌ట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ రూ.8.25 కోట్లు తీసుకుంటున్నారు. గత ఏడాది పంజాబ్ జట్టుకు ఒంటిచేత్తో చిరస్మరణీయ విజయాలను ఆయ‌న అందించాడు. 

గుజ‌రాత్ టైటాన్స్‌కు సార‌ధ్య బాధ్య‌త‌లు చేప‌డుతున్న హార్డింగ్ పాండ్యా ఈ సారి ముంబై ఇండియ‌న్స్ మారుతున్నారు. గుజ‌రాత్ తిరిగి ఆయ‌న‌ను ముంబైకి అప్ప‌గించినందుకు ఆ జ‌ట్ట‌కు రూ.100 కోట్లు చెల్లించిన‌ట్లు ప‌లు రూమ‌ర్లు వ‌స్తున్నాయి. హార్డిక్ పాండ్యాకు రూ.15 కోట్లు పారితోషికం ఆ ఫ్రాంచైజీ చెల్లిస్తోంది. ఇక గుజ‌రాత్ సార‌ధ్య బాధ్య‌త‌ల‌ను శుభ్‌మ‌న్ గిల్ తీసుకుంటున్నారు. ఇత‌ను 2022 మినీ వేలంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ నుంచి గుజ‌రాత్ జ‌ట్టుకు వ‌చ్చారు.  ఇత‌డికి ప్ర‌స్తుతం గుజ‌రాత్ టైటాన్స్ రూ.8 కోట్ల పారితోషికం చెల్లిస్తోంది. ఇక‌ రాయల్ చాలెంజ్ బెంగళూరు జట్టుకు పాప్ డూప్లెసెస్ సార‌థ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ వేలంలో అతడికి రూ.7 కోట్లు పారితోషికం ద‌క్కించుకున్నాడు. ఆర్‌సీబీ జ‌ట్టుకు కెప్టెన్సీ బాధ్య‌త‌ల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకున్న తర్వాత డూప్లెసెస్ కెప్టెన్ గా కొన‌సాగుతున్నారు. 

Read Also రోబో డాగ్ ను ఆసక్తికరంగా వీక్షిస్తున్న క్రికెట్ అభిమానులు!

ఈ ఏడాది  స‌న్ రైజ‌ర్స్ హైదరాబాద్ జట్టుకు ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ పాట్ క‌మిన్స్ సారథ్యం వహించ‌నున్నారు. ఐపీఎల్ మినీ వేలంలో పాట్ క‌మిన్స్‌కు హైదరాబాద్ ఫ్రాంచైజీ రూ. 20.50 కోట్లకు అతడిని కొనుగోలు చేసింది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రుష‌భ్ పంత్ మార్పు ఉండకపోవచ్చు. ప్రతి ఏడాది అతడికి ఆ ఫ్రాంచైజీ రూ.16 కోట్లు చెల్లిస్తోంది. కోల్‌క‌తా నైట్ రైడర్స్ జట్టుకు శ్రేయస్ అయ్యర్ సారధ్యం వహిస్తున్నారు. ఇతడిని రూ.12.25 కోట్లతో ఆ జట్టు కొనుగోలు చేసింది. గాయం కార‌ణంగా గత ఏడాది ఇతడు సీజన్ ఆడలేదు ఆడలేదు ఈ సీజన్ కు కూడా అతడే మళ్లీ సార‌ధ్య బాధ్యతలు తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం. ల‌క్నో సూపర్ జెంట్స్ తరఫున కేఎల్ రాహుల్ సార‌ధ్యం వహిస్తున్నాడు. గత రెండు సీజన్ల నుంచి ఆ ఫ్రాంచైజీకి అత‌డు బాధ్య‌త‌లు చేప‌డుతున్నాడు. ఈసారి కూడా ఆ ఫ్రాంచైజీకి అతనే కెప్టెన్‌గా కొన‌సాగ‌నున్నారు. ఇతడికి రూ.17 కోట్లు ఆ ఫ్రాంచైజీ చెల్లిస్తోంది.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?