MI Vs DC IPL 2024 : హోమ్ గ్రౌండ్ లో మొదటి విజయం అందుకున్న ముంబైై ఇండియన్స్...
దీనిలో భాగంగా ఈరోజు మ్యాచ్లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకొని బరిలో దిగగా, తోలుతా బ్యాటింగ్ చేసేందుకు బరిలో దిగిన ముంబై ఇండియన్స్ నిర్దేశిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేశారు. అనంతరం 235 పరుగుల లక్ష్య చేదనతో బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 205 పరుగులు చేసి 8 వికెట్లను కోల్పోయింది.

మూడు వరుస పరాజయాలతో పాయింట్లు పట్టికలో చివరి స్థానంలో ఉన్న ముంబై టీమ్ నాలుగో మ్యాచ్ ఎలాగైనా గెలవాలనే కసితో బరిలో దిగిన ముంబై బ్యాటర్స్ ఢిల్లీ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఈ నేపథ్యంలోనే ఓపినర్ గా బరిలో దిగిన రోహిత్ శర్మ 27 బంతుల్లో 6 ఫోర్స్ 3 సిక్స్ లతో 49 పరుగులు చేయగా, ఇషాన్ కిషన్ 23 బంతుల్లో 4 ఫోర్స్, 2 సిక్స్ లతో 42 పరుగులు చేసి అదరగొట్టాడు.
అలాగే 5 బంతుల్లో 1 ఫోర్ కొట్టి 6 పరుగులతో తిలక్ వర్మ పెవిలియన్ బాట పట్టగా , టీమ్ డేవిడ్ 21 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సులతో 45 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు.ఇక చివరాఖరిలో వచ్చిన రోమారియో షెఫర్డ్ కేవలం 10 బంతుల్లో 3 ఫోర్లు 4 సిక్సులు కొట్టి 39 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. లాస్ట్ ఓవర్ లో రొమారియో ఏకంగా 32 పరుగులు చేయడం గమనార్హం.
ఈ విధంగా ముంబై ఇండియన్స్ నిర్దేశిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేయగా... అనంతరం బరిలో దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 8 వికెట్లు నష్టానికి 20 ఓవర్లలో 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్ లో ముంబై ఇండియన్స్ తన మొట్టమొదటి విజయాన్ని హోమ్ గ్రౌండ్ వేదికగా సాధించింది.