MI vs SRH IPL 2024 : 31 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్పై సన్ రైజర్స్ గెలుపు
కానీ పాట్ కమిన్స్ కెప్టెన్సీగా రావడంతో ఈసారి ఆటలో మార్పు వచ్చిందనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 17 సీజన్లు ఆడిన ఐపీఎల్ హిస్టరీలో ఏ మ్యాచ్లోనూ చేయని స్కోరు 277 పరుగులు చేసి సన్రైజర్స్ విజయాన్ని సాధించింది.

బుధవారం ముంబై ఇండియన్స్ తో ఉప్పల్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్లో పరుగుల సునామీతో చెలరేగింది సన్ రైజర్స్ ఆటగాళ్లు విధ్వంసం సృష్టించారు. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 277 పరుగులు చేసింది.
సన్ రైజర్స్ కెప్టెన్ మక్రం 28 బంతుల్లో 42 పరుగులు చేయగా.. పవర్ ప్లే లో హేడ్ 24 బంతుల్లో 62 పరుగులు, అభిషేక్ శర్మ 23 బంతుల్లో 64 పరుగులు చేసి మ్యాచ్కి మంచి ఆరంభాన్ని ఇచ్చారు. పవర్ ప్లే లోనూ ఐపీఎల్ చరిత్రలో 6 ఓవర్లకు 80 పరుగులు చేసి రికార్డును నమోదు చేశారు.
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్లు నష్టపోయి 246 మాత్రమే పరుగులు చేసింది. 31 పరుగుల తేడాతో హైదరాబాద్ సన్రైజర్స్ విజయం సాధించింది.
ఒక దశలో మ్యాచ్ సన్ రైజర్స్ నుంచి చేజారి పోతుందనిపించింది. తిలక్ వర్మ 64 పరుగులు, టిమ్ డేవిడ్ 42 పరుగులు చేశాడు. తొలిసారిగా ఐపీఎల్ చరిత్రలో 500లకు పైగా పరుగులు చేసిన మ్యాచ్ కావడం గమనార్హం.