Cricket : భారత స్టార్ ఆటగాళ్లకు ఏమైంది?
నేడు మధ్యాహ్నం కొత్త జట్టు ఎంపిక
Cricket : న్యూఢిల్లీ : భారత్ - ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టులకు గాను భారత్ స్టార్ ఆటగాళ్లు దూరమవుతున్న తీరు చూస్తే విస్మయం కలుగుతోంది. ఇప్పటికే జరిగిన రెండు మ్యాచ్ల్లో చెరొకటి విజయం సాధించి సిరీస్ ను సమంతో కొనసాగుతోంది. కాగా ఈ రెండు మ్యాచ్లకే భారత స్టార్ ఆటగాళ్లు గాయాలతో దూరమయ్యారు. ఇక మిగతా మ్యాచ్ల గురించి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరో మూడు టెస్ట్ మ్యాచ్లు జరగనున్న నేపథ్యంలో సీనియర్లు ఆడుతారా? లేదా? అనేది సందిగ్ధంగా ఉంది. ఇప్పటికే స్టార్ ఆటగాళ్లకు వివిధ కారణాలతో ఆటకు దూరమయ్యారు.
ఇక మిగిలిన మూడు మ్యాచ్లల్లో ఎవరు ఆడతారో తెలియని పరిస్థితి నెలకొంది. వ్యక్తిగత కారణాల వల్ల దూరమైన విరాట్ కోహ్లీ మిగతా మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడే అవకాశం పై ఇంకా సస్పెన్షన్ వీడలేదు. కోహ్లీ సమస్య ఏమిటో కూడా ఉన్నతాధికారులు బోర్డు బయటకు చెప్పలేదు. సెలెక్టర్లు టీంను ప్రకటించేటప్పుడు మొదట్నుంచి సందేహంగానే ఉన్నారు. రోహిత్ శర్మ సారధ్యంలో 17 మంది ఆటగాళ్లను అజిత్ అగార్కర్ సారథ్యంలో ప్రకటించింది. అయితే గాయాల కారణంగా ఇప్పటికే కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా దూరమయ్యారు.