Komati Reddy Venkat Reddy: రైస్ మిల్ల‌ర్ల‌కు మంత్రి హెచ్చ‌రిక‌.. మ‌ద్ద‌తు ధ‌ర చెల్లించ‌కుంటే మిల్లులు సీజ్‌

మిర్యాల‌గూడ‌లో యాజ‌మాన్యాకు వార్నింగ్ ఇచ్చిన కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

Komati Reddy Venkat Reddy: రైస్ మిల్ల‌ర్ల‌కు మంత్రి హెచ్చ‌రిక‌.. మ‌ద్ద‌తు ధ‌ర చెల్లించ‌కుంటే మిల్లులు సీజ్‌

Komati Reddy Venkat Reddy: నల్లగొండ జిల్లాప్రతినిధి. మార్చి 20. (క్విక్ టుడే) : తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లులు రైతుల‌కు మ‌ద్ద‌తు ధ‌ర చెల్లించాల‌ని, లేదంటే రైస్ మిల్లులు సీజ్ చేస్తామ‌ని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డి హెచ్చ‌రించారు.

బుధవారం మిర్యాలగూడలో మంత్రి పలు దేవాలయాల ప్రారంభోత్సవం కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ క్ర‌మంలో రైస్ మిల్లుల వద్ద ఆగి రైతులు పండించిన ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదని మంత్రికి ఫిర్యాదు చేశారు.

వెంట‌నే స్పందించిన మంత్రి వెంకట్‌రెడ్డి డీఎస్‌వోతో ఫోన్‌లో మాట్లాడారు. తక్కువ ధరకి ధాన్యం కొంటున్న మిల్లు యజమాన్యంపై ఫిర్యాదు చేశారు. గ్రేడ్ ఏ 2,203, సాధారణ రకం రూ.2183 ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ధర నిర్ణ‌యించింద‌ని తెలిపారు. మిల్లర్లు రూ.1900 నుంచి 2వేల వరకే కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారని, అలాగే సన్న రకం ధాన్యం రూ.2500 వరకు కొనుగోలు చేయాలని అధికారికి వివరించారు.

సన్న బియ్యం ఎక్కువ ధరకు అమ్ముకుంటున్న మిల్లర్లు సన్న వ‌రి ధాన్యానికి ఎందుకు మద్దతు ధర ఇవ్వడం లేద‌ని మండిపడ్డారు. ఇక‌పై ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృత‌మైతే రైస్ మిల్లులు సీజ్ చేయ‌డం ఖాయ‌మ‌ని హెచ్చ‌రించారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?