రాచకొండ కమిషనరేట్, మే 9 (క్విక్ టుడే న్యూస్):-మావోయిస్టుల కాల్పుల్లో వీర మరణం పొందిన మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని ఘట్కేసర్ కు చెందిన రాచకొండ ఏఆర్ జవాన్ తిక్క సందీప్ భౌతిక కాయాన్ని రాచకొండ సీపీ సందర్శించారు. సీపీతో పాటు రాష్ట్ర ఐటీ, పరిశ్రమ, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జి తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి తదితరులు సందీప్ భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారు రాజిరెడ్డి భౌతికకాయాన్ని కూడా రాచకొండ సిపి సందర్శించి నివాళులు అర్పించారు.
