తొర్రూరు మే 29(క్విక్ టుడే న్యూస్):- కొనుగోలు కేంద్రాలలో కాంటాలు పెట్టి సిద్ధంగా ఉన్న చోటుకు వాహనాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని తరలించడం జరుగుతుందని తొర్రూరు తహసిల్దార్ జీ. శ్రీనివాస్ తెలిపారు.గురువారం రెవెన్యూ సిబ్బంది ఆర్టీవో సిబ్బంది సంయుక్తంగా పాల కేంద్రం దగ్గర తిష్ట వేసి ఖాళీగా వచ్చే వాహనాలను ఆపి కొనుగోలు కేంద్రాలకు తరలించారు.

ఈ సందర్భంగా తొర్రూరు తహసిల్దార్ మాట్లాడుతూ..తొర్రూరు మండలం లోని పలు గ్రామాలలోనీ కొనుగోలు కేంద్రాలలో వాహనాలు కొరత ఉండడంతో పాలకేంద్రం చోట తిష్ట వేసి ఖాళీగా వచ్చే వాహనాలను ఆపి అవసరం ఉన్న కొనుగోలు కేంద్రానికి తరలించి రైతుల ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నామని అన్నారు.గురువారం చీకటాయపాలెం,వెలికట్ట, చర్లపాలెం, అమ్మాపురం, గుర్తూరు,గోపల గిరి, నాంచారి మడూర్, హరిపిరాల గ్రామాలకు 15 లారీలు రెండు డీసీఎంలను తరలించి కాంటాలు పెట్టిన ధాన్యాన్ని మిల్లులకు తరలించామన్నారు.పాల కేంద్రం దగ్గర ఆర్టీవో సిబ్బందితో తిష్ట వేసి ఖాళీగా వస్తున్న లారీలు డీసీఎంలను కొనుగోలు కేంద్రాలకు తరలించామని సహకరించిన డీసీఎం లారీ డ్రైవర్లు ఓనర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ కొనుగోలు కేంద్రంలోనైనా కాంటాలు పెట్టి సిద్ధంగా ఉండి వాహనాలు లేకపోతే వెంటనే మాకు తెలియజేస్తే వాహనాన్ని అరేంజ్ చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) బషీర్,రెవెన్యూ సిబ్బంది యశ్వంత్, దూగుంట్ల శ్రీనివాస్, ప్రశాంత్, సుధాకర్, రమేష్, ఆర్టీఎ సిబ్బంది వరుణ్ తదితరులు పాల్గొన్నారు.