రైతుల ఆందోళన – ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్

రైతుల ఆందోళన – ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్

శివ్వంపేట మే 19 (క్విక్ టు డే న్యూస్):- ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని నెల రోజుల పాటు ధాన్యం కొనుగోలు చేయడం లేదని, అధిక తరుగుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సోమవారం పిఏసీఎస్ సీఈఓ ను రైతులు నిలదీసి, శివ్వంపేట పిఎసిఎస్ బ్యాంకు ముందు నర్సాపూర్ తూప్రాన్ ప్రధాన రోడ్డుపై 30 నిమిషం పాటు రైతులు రాస్తారోకో నిర్వహించారు. IMG-20250519-WA0058ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నెలరోజుల నుండి వడ్లను కొనుగోలు చేయకపోవడంతో పాటు అకాల వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర గ్రామాల్లో హమాలీలు 40 రూపాయలు తీసుకుంటే ఇక్కడ అధికంగా రూ. 50 వసూలు చేస్తున్నారని అధికారుల నిర్లక్ష్యంతో తమ సొంత ట్రాక్టర్లలో ధాన్యాన్ని రైస్ మిల్ లోకి తరలిస్తే క్వింటాల్ కి 8 కిలోల తరుగు తీస్తున్నారని వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే వడ్లను కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అదేవిధంగా దొడ్డు వడ్లను కొనుగోలు చేయడం లేదని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పన్లతోపాటు కనీస సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నామని రైతులు తెలిపారు. సంఘటన స్థలానికి ఎస్ఐ మధుకర్ రెడ్డి తన సిబ్బందితో వచ్చి రైతులకు సర్ది చెప్పి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో రైతులు రాస్తారోకో ను విరమింప చేశారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?