గుండ్లపల్లిలో ధాన్యం గోల్‌మాల్ – సీఓ భర్త పై ఆరోపణలు

గుండ్లపల్లిలో ధాన్యం గోల్‌మాల్ – సీఓ భర్త పై ఆరోపణలు

శివ్వంపేట మే 22 (క్విక్ టు డే న్యూస్):- రైతులు వేలాది రూపాయల పెట్టుబడులుIMG-20250522-WA0029

పెట్టి, ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొందరు దొంగ పనులు చేస్తూ, రైతుల కష్టాన్ని స్వాహా చేస్తున్నారు. ప్రభుత్వ నియమావళి ప్రకారం పని చేయాల్సిన ఐకెపి అధికారులు దొంగ దందాలకు శ్రీకారం చుట్టడం పై మండల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా శివ్వంపేట మండల పరిధిలోని గుండ్లపల్లి లో ఐకెపి సీఓ చంద్రకళ భర్త బోళ్ల సదానందం రైతులకు సంబందించిన 9 క్వింటాళ్ల 30 కిలోల ధాన్యాన్ని గోల్ మాల్ చేశారని రైతులు నిలదీయడంతో తిరిగి వారికి డబ్బులు చెల్లించారు. ఈ సందర్భంగా బాధిత రైతులు ఒగ్గు సురేష్, పెంజర్ల మహేష్, పెంజర్ల శ్రీనివాస్, ఎండి ఖాదర్ పాషా, గొర్రె విష్ణువర్ధన్ రెడ్డి, పెంజర్ల నరసింహ, ఎర్ర పోచయ్య, అగ్రహారం నరసింహ, ఉప్పు నూతల మహేష్, పెంజర్ల మల్లేష్,పి మమత ల నుంచి కొనుగోలు చేసిన వరిధాన్యంలో మొత్తం తొమ్మిది క్వింటాళ్ల 30 కిలోలు ధాన్యాన్ని లెక్కల్లో తేడా చేశారని, సిఓ పై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

Read Also లైసెన్స్ డ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?