మేడిపల్లిలో హైడ్రా హడల్.. ఆక్రమణదారుల్లో గుబుల్ వరుసగా రెండో రోజూ కూల్చివేతలు చేపట్టిన యంత్రాంగం 

మేడిపల్లిలో హైడ్రా హడల్.. ఆక్రమణదారుల్లో గుబుల్ వరుసగా రెండో రోజూ కూల్చివేతలు చేపట్టిన యంత్రాంగం 

మేడిపల్లి మే 22 (క్విక్ టుడే న్యూస్):-మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలంలో హైడ్రా వరుసగా రెండో రోజూ కూల్చివేతలు చేపట్టింది. సేజ్ స్కూల్లో రోడ్డు కబ్జాను బుధవారం హైడ్రా అధికారులు తొలగించిన విష‌యం తెలిసిందే.. కాగా గురువారం పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ సాయి ఐశ్వ‌ర్య కాల‌నీలోని సాలార్ జంగ్ కంచె సర్వే నెంబర్ 1 ప్ర‌భుత్వ భూమిలో వెల‌సిన అక్ర‌మ నిర్మాణాల‌ను కూడా నేల‌మ‌ట్టం చేశారు. IMG-20250522-WA0033దీంతో ప్రభుత్వ భూముల‌ను ఆక్ర‌మించి నిర్మాణాలు చేప‌ట్టిన వారి గుండెల్లో గుబేల్‌ మొదలైంది. హైడ్రా కూల్చివేత‌ల ప‌ట్ల స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. భూముల ధ‌ర‌ల‌కు రెక్క‌లు రావ‌డంతో అక్ర‌మార్కులు ప్ర‌భుత్వ భూముల‌పై క‌న్నేసి క‌బ్జాల‌కు య‌థేచ్ఛ‌గా పాల్ప‌డుతున్న‌ట్లు వారు ఆరోపించారు. IMG-20250522-WA0032సాయి ఐశ్వ‌ర్య కాల‌నీలోని స‌ర్వే నెంబ‌ర్ 1లో మొత్తం 3 ఎక‌రాల ప్ర‌భుత్వ‌ భూమిని గ‌తంలో గ్రామ పంచాయ‌తీ స‌ర్పంచ్‌లు త‌మ‌కు గ్రేవ్ యార్డ్ కోసం కేటాయించార‌ని ముస్లిం, క్రైస్త‌వ మైనార్టీ సోద‌రులు మీడియాతో తెలిపారు. అయితే ఇటీవ‌ల కొంంద‌రు మాజీ ప్ర‌జాప్ర‌తినిధులు త‌మ అధికారం అడ్డంపెట్టుకుని అక్ర‌మంగా లేఅవుట్ చేసి ఈ భూమిలే నిర్మాణాలు చేప‌ట్టార‌ని తెలిపారు. దీంతో ఏళ్ల త‌ర‌బ‌డి త‌మ భూముల‌ను కాపాడుకునేందుకు అలుపెరుగ‌కుండా పోరాడామని తెలిపారు. ప‌క్క స‌ర్వే నెంబ‌ర్ 12 తో దొంగ డాక్యుమెంట్లు సృష్టించి త‌మ అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఆక్ర‌మించార‌ని తెలిపారు. గ‌తంలో మ‌ల్కాజిగిరి ఎంపీగా ఉన్న‌ప్పుడు రేవంత్ రెడ్డి దృష్టికి ఈ విష‌యాన్ని తెలిపామ‌ని పేర్కొన్నారు. అయినా అప్ప‌టి బీఆర్ ఎస్ ప్ర‌భుత్వం అక్ర‌మార్కుల‌కే స‌హ‌క‌రించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం  చేశారు. అయితే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వ భూముల‌ను కాపాడేందుకు ఇటీవ‌ల ఏర్పాటు చేసిన హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌కు ఈ విష‌యాన్ని తీసుకెళ్లామ‌ని తెలిపారు. స‌ర్వే నెంబ‌ర్ 1  ప్రభుత్వ భూమిలో పట్టా భూమి సర్వే నెంబర్ 12 ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని కోర్టును కూడా త‌ప్పుదోవ ప‌ట్టించార‌ని,  ముస్లిం,  క్రైస్తవ మైనార్టీలకు చెందిన సమాధులను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టారని హైడ్రాకు ఫిర్యాదు చేసిన‌ట్లు వివ‌రించారు. దీంతో బుధవారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించి తహసిల్దార్ షేక్ హసీనాను అస‌లు విష‌యం అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని చెప్పిన రంగనాథ్ మరుసటి రోజే కూల్చివేత‌ల‌ను చేపట్ట‌డం ప‌ట్ల స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, కమిషనర్ రంగనాథ్ లకు ప్ర‌త్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.  గత ఐదేళ్లుగా చేసిన పోరాటానికి నేడు తమకు ఫలితం దక్కిందని వారు సంబరపడ్డారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?