మాడుగులపల్లి, మే 29 (క్విక్ టుడే న్యూస్):- కుక్కడం గ్రామం లోని చైతన్య సమభావన సంఘం సభ్యురాలు కొండేటి పద్మ స్కూల్ యూనిఫామ్ కుట్టే విధానాన్ని మాడుగులపల్లి ఏ.పి.యమ్ బాషపాక చంద్రశేఖర్, సంబందిత వి.ఓ.ఏ లు సైదమ్మ, ప్రవళిక తో కలిసి సందర్శించారు. స్కూల్ యూనిఫామ్స్ కుట్టే విధానాన్ని పర్యవేక్షణ చేసి, స్కూల్ విద్యార్థిని, విద్యార్థులకు వారి యొక్క కొలతల ప్రకారం నాణ్యమైన కుట్టుతో కుట్టాలని తెలియజేశారు.

మండలంలో మహిళా టైలర్స్ ని గుర్తించి, మండలంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ హై స్కూల్, మండల ప్రాథమిక పాఠశాల, కస్తూర్బా గాంధీ పాఠశాలలు కలిపి బాలురు 713 మంది, బాలికలు 830మంది, మొత్తం 1543 మంది విద్యార్థిని, విద్యార్థులకు మహిళా సంఘా సభ్యుల ద్వారా స్కూల్, కాలేజీ యూనిఫామ్స్ కుట్టించి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా మహిళలకు జీవనోపాధి కల్పించడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవడం జరుగుతుంది. గురువారం వరకు మండలంలోని మహిళా టైలర్స్ అందరూ కలసి 150 మంది బాలురు, 150 మంది బాలికలు, మొత్తం 300 మంది విద్యార్థిని, విద్యార్థులవి యూనిఫామ్స్ కుట్టగా, జూన్ 8వ తేదీలోపు మొత్తం పూర్తి చెయ్యాలని ఏ.పి.యమ్ బాషపాక చంద్రశేఖర్ తెలియజేశారు.