Mahalakshmi scheme : మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500...ఎలా పొందాలంటే...

Mahalakshmi scheme : మహాలక్ష్మి పథకం కింద మహిళలకు రూ.2500...ఎలా పొందాలంటే...

Mahalakshmi scheme : తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పటికే వాటిలో చాలా పథకాలు అమలు చేస్తూ వస్తున్నారు. అయితే వీటిలో మరీ ముఖ్యంగా మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ సర్కార్ హామీ ఇచ్చింది.

ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది. ఇక ఈ ఉచిత బస్సు సౌకర్యంతో తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరూ పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ లలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అదేవిధంగా 6 గ్యారెంటీలలో భాగంగా ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచడం కూడా జరిగింది. అలాగే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలందరికీ రూ.500 కి గ్యాస్ సిలిండర్లు కూడా అందిస్తున్నారు.

Read Also వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా స్వామి వారి ఇరవై వార్షికోత్సవం కార్యక్రమాలు

38 -2

Read Also యూత్ లీడర్స్ విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు శ్రేయోభిలాషులతో ఎంఈఓ సమావేశం

ఈ పథకం ద్వారా లక్షల్లో మహిళలు లబ్ధి పొందుతున్నారు. కాని  ముందు గ్యాస్ సిలిండర్ కు రూ.900 చెల్లిస్తేనే సిలిండర్ ఇస్తారు. ఆ తర్వాత లబ్ధిదారుల ఖాతాలో తిరిగి రూ.400  జమ చేస్తున్నారు. దీంతో లబ్ధిదారులు రూ.500 కి గ్యాస్ సిలిండర్లను పొందుతున్నారు. అదేవిధంగా గృహ జ్యోతి పథకం కింద అర్హులైన వారందరికీ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం.

Read Also ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి యశస్విని ఝాన్సీ రెడ్డిలు

ఈ విధంగా అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఒకటి తరువాత ఒకటి పూర్తి చేస్తూ వస్తున్నారు. అయితే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలలో మహాలక్ష్మి పథకంలో భాగంగా మరో హామీ కూడా ఒకటి చేయాల్సి ఉంది. అదే కుటుంబ మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం. ఎన్నికలకు ముందు మహిళలందరికీ నెలకు రూ.2500 ఖచ్చితంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.

Read Also రైతులకు అండగా జిల్లా యంత్రాంగం

38 -3

Read Also తెలుగు వృత్త్యంతర శిక్షణలో జ్ఞాన దర్శిని పుస్తక సమీక్ష

మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇస్తామని ఈ గ్యారెంటీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎప్పటినుండి అమలు చేస్తారని ప్రతిపక్షాలు సైతం పదేపదే ప్రశ్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ పథకం పై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండడం వలన లోక్ సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సహాయం ఇచ్చే పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాలన్నీ పొందాలంటే లబ్ధిదారులు కచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే ఈ పథకాలను పొందేందుకు అర్హులు అవుతారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?