వ‌ర్షాకాలంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి..అధికారులు, క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి

వ‌ర్షాకాలంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి..అధికారులు, క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి

మేడ్చ‌ల్ క‌లెక్టరేట్‌, మే 27 (క్విక్ టుడే న్యూస్‌):-కమాండ్ కంట్రోల్ సెంటర్ లో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయం నుండి  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ వీడియో కాన్ఫరెన్సులో ఉపముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, అన్ని జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. IMG-20250527-WA0106ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, రుతుపవనాలు,  వానాకాలం పంటల సాగు అంశాలపై చర్చించారు. వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈసారి 15 రోజుల ముందే రుతుపవనాలు వచ్చాయని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అత్యధికంగా 64 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 90 శాతం ధాన్యం సేకరణ పూర్తయిందని ఈ సందర్భంగా అధికారులు, కలెక్టర్లను నేను అభినందిస్తున్నానన్నారు. రుతుపవనాలు ముందుగా రావడంతో మిగతా ధాన్యం సేకరించడం ఇబ్బందిగా మారిందని  అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోలు చేసి ఇప్పటి వరకు రైతులకు రూ. 12184 కోట్లు చెల్లించామని, గతంలో ఎప్పుడూ లేని విధంగా ధాన్యం సేకరించిన 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న చిన్న సంఘటనలు ప్రచారంలోకి వస్తున్నాయని, కొన్నిచోట్ల రాజకీయ ప్రేరేపిత సంఘటనలు జరుగుతున్నాయి. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు వల్లనే అని దుష్ప్రచారం చేస్తున్నారని కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను వెల్లడించాలని, కలెక్టర్లు ప్రో యాక్టివ్ గా ఉంటూ వైఫల్యాలు ఉంటే సరిదిద్దుకోవాలన్నారు. తప్పుడు ప్రచారం చేస్తే వివరణ ఇవ్వలని, చిన్న చిన్న సమస్యలు ఉంటే తక్షణమే పరిష్కరించాలని, ఒక్క నిముషం వృధా చేయకూడదు, అదేవిధంగా నిర్లక్ష్యం వహించొద్దని అవసరమైతే లోకల్ గోడౌన్స్ హైర్ చేయండి, మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోండని సిఎం స్పష్టం చేసారు. ఈసారి 29 శాతం వర్షపాతం అధికంగా ఉంది. సీజన్ ముందు రావడంతో వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలి రైతులకు విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉన్నాయన్నారు.పంటల వివరాలు, స్థానిక అవసరాలను గుర్తించి రైతులకు ఇబ్బంది కలుగకుండా చూడాలి, నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే అలాంటి వారిపై పీడీ యాక్ట్ పెట్టి, నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాలి, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలి జిల్లాలవారిగా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియనించుకోవాలని, భూభారతి పేద రైతులకు చుట్టం అనే విషయం ప్రజలలోకి వెళ్లాలని, అందుకు భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించి భూభారతి చట్టాన్ని ప్రజలకు చేరువ చేయాలన్నారు.  జూన్ 3 నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించి, ఇందిరమ్మ ఇండ్లు చాలా కీలకం క్షేత్రస్థాయిలో బాగా జరగాలంటే అది కలెక్టర్ల చేతిలోనే ఉంది మండలస్థాయిలో ధరల నియంత్రణ కమిటీ వేయాలి మేస్త్రీ చార్జీలు, క్రషర్ ధరలను పర్యవేక్షించాలి ఉచిత ఇసుక కూపన్లు సకాలంలో సరఫరా చేయాలి ఇటుక తయారీ, సెంట్రింగ్ యూనిట్స్ ఏర్పాటుకు రుణాలు అందించండి క్షేత్ర స్థాయిలో ప్రాక్టికల్ సమస్యలను గుర్తించి పరిష్కరించాలి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలని,29, 30 తేదీల్లో జిల్లాల ఇంచార్జ్ మంత్రులు సంబంధిత జిల్లాల్లో పర్యటించాలని సిఎం సూచించారు. జూన్ 1 నాటికి పూర్తి నివేదిక అందించాలని తెలిపారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుండి  జిల్లా కలెక్టరు గౌతం, మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు కలెక్టర్లు రాధికాగుప్తా, విజయేందర్ రెడ్డి, డిఆర్ఓ హరిప్రియ, ఆర్డిఓలు ఉపేందర్ రెడ్డి, శ్యాంప్రకాష్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?