కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాల్లో పాల్గొనాలి

కార్మికుల హక్కుల సాధన కోసం పోరాటాల్లో పాల్గొనాలి


మాడుగులలపల్లి, మే 01 (క్విక్ టుడే న్యూస్):- కార్మికుల హక్కుల సాధన కోసం నాటి కార్మికుల పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలని సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి కోరారు. గురువారం కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా మాడ్గులపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ 139 సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా 12గం.ల పని విధానం రద్దు చేయాలని, పనికి తగ్గ సమాన వేతనం ఇవ్వాలని, వెట్టి చాకిరీ విముక్తి కోసం కార్మికులు పోరాడి విజయం సాధించిన రోజుకు ప్రతీకగా ప్రతి ఏటా మే డే ను జరుపుకుంటామన్నారు. ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంకెళ్ళు తప్ప అనే నినాదంతో కార్మికులు ఏకమై ఉద్యమాలు చేశారన్నారు. నాటి కార్మిక పోరాటాలలో అనేక మంది కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, పోరాడి అమరులయ్యారు అన్నారు. కానీ ఈ దేశంలో ఇప్పటికి 8గం.ల పని విధానం పూర్తి స్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదన్నారు. అనేక చోట్ల రోజుకు 12 నుండి 14గం.ల పని చేయిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ లను తీసుకొచ్చి, కార్మికుల పొట్టగొట్టే ప్రయత్నాలు చేస్తుందన్నారు. 29 రకాల చట్టాలను 4 కోడ్ లుగా మార్చి, మళ్ళీ కార్మికులను వెట్టి చాకిరీ చేయించేందుకు కార్పోరేట్లకు లాభం చేకూర్చే విధంగా ఉందన్నారు. 29 రకాల కార్మిక చట్టాలు పూర్తి స్థాయిలో అమలు చేసే విషయంలో, కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కొత్త కార్మిక చట్టాలను తీసుకొచ్చి సమ్మె చేసే హక్కును, యూనియన్ లను ఏర్పాటు చేసుకునే హక్కూలను కాలరాస్తుందన్నారు. మరో వైపు రైతులకు, రైతు కూలీలకు గిట్టుబాటు ధరలు, వేతనాలు పెంచే విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ప్రతి కార్మికుడికి నెలకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలన్నారు. ఉద్యోగ భద్రత, జీవనోపాధి, నైపుణ్యాభివృద్ధి కల్పన విషయంలో ప్రభుత్వాలు అధిక నిధులు కేటాయించి కార్మికుల హక్కులను కాపాడాలన్నారు. 8 గం.ల పని విధానం పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులకు పెంచి, రోజుకు 600 రూపాయల వేతనం ఇవ్వాలన్నారు. కార్మికుల హక్కుల కోసం నాటి నుంచి నేటి వరకు అనునిత్యం పోరాడేది ఎర్ర జెండా అన్నారు. నాటి కార్మికుల పోరాట స్ఫూర్తితో నేటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాల పైన పోరాటం చేయాలన్నారు. కార్మిక, కూలి సంఘాల్లో సభ్యత్వం తీసుకొని కార్మికుల హక్కుల పోరాటాలలో పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల సీనియర్ నాయకులు దేవిరెడ్డి అశోక్ రెడ్డి, మండల కమిటీ సభ్యులు పుల్లెంల శ్రీకర్, నగిరె కృష్ణయ్య, జూకూరి నాగయ్య, గడగోజు వెంకటాచారి, కన్నయ్య, మండల నాయకులు కట్ట సతీష్ రెడ్డి, పర్శరాములు, లింగస్వామి, మాధవ్, వెంకన్న, వెంకట్ రెడ్డి, వెంకయ్య, పద్మ, లక్ష్మమ్మ, మాధవి, ఇద్దమ్మ, మహేశ్వరి, యాదమ్మ, ప్రమీల, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.

IMG-20250501-WA0108

Read Also ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులు విరమించుకోవాలి

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?