శివ్వంపేట, ఏప్రిల్ 21 (క్విక్ టు డే న్యూస్):-కరోనా సమయంలో సేవలందించిన మహేష్ గుప్తను విమర్శిస్తున్న కాంగ్రెస్ నేతలపై మండల పార్టీ అధ్యక్షుడు రమణ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శివ్వంపేటలో విలేకరులతో మాట్లాడుతూ, మహేష్ గుప్త గతంలో 55 బోర్లు, 30 గ్రామాలకు ఎల్ఈడీ లైట్లు, వేలాది పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారని చెప్పారు.డివైడర్, బటర్ ఫ్లై లైట్లు, సీసీ రోడ్లు, మార్కెట్ యార్డ్, దేవాలయాల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన హయాంలో జరిగాయని గుర్తు చేశారు. మహేష్ గుప్త పబ్లిసిటీ కోసం పనిచేయలేదని, నిజమైన ప్రజాసేవకుడని పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నవీన్ గుప్త వ్యాఖ్యలను ఖండిస్తూ, అధికారం ఉందని ఏది కావాలంటే అది మాట్లాడే కాలం కాదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, పద్మ వెంకటేష్ ముదిరాజ్, గ్రామకమిటీ అధ్యక్షులు లక్ష్మీనర్సయ్య, కొండల్,బాసంపల్లి రామగౌడ్,పైనం గా యాదగిరి, పోచగౌడ్,లక్ష్మీనారాయణ, సుదర్శన్ గౌడ్, పంబళ్ల సంతోష్,గుండ స్వామి, ముద్దగల్ల రాజు, హరీష్ అజయ్. రుస్తుంపేట నవీన్ సాయి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
