అర్హులైన నిరుపేదలకు తక్షణమే డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చెయ్యాలి..

పెరకపోవడం జరిగిందని ఆరోపిస్తూ, నిరుపేదలకు అట్టి ఇండ్లను పంపిణీ చెయ్యాలని స్థానిక ఆర్డిఓ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో పేదలతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టి కార్యాలయ సిబ్బందికి వినతిపత్రాన్ని అందజేయడం జరిగిందని పేర్కొంటూ ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వెంటనే స్పందించి కేంద్రంలో నిర్మించి ఉన్న 280 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన పేదలను గుర్తించి పంపిణీ చేసి వారిని ఆదుకోవాలని కోరుతూ లేని ఎడల రాబోయే రోజుల్లో నిరుపేదలందరినీ ఐక్యం చేసి డబుల్ బెడ్ రూములు పంచేవరకు సిపిఎం ఆధ్వర్యంలో దశలవారీగా ధర్నాలు వస్తా రోకోలు లాంటి కార్యక్రమాలతో పాటు నిరాహార దీక్ష వంటి కార్యక్రమాలను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యుడు జమ్ముల శ్రీనివాస్, ధరావత్ యాకన్న, మండల నాయకులు బోరా స్వామి,ఎండి నజీర్,గజ్జి రామ్మూర్తి తో పాటు అర్హులైన నిరుపేదలు తదితరులు పాల్గొన్నారు.