ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలి


తొర్రూరు జూన్ 03(క్విక్ టుడే న్యూస్):-  ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ రవీందర్ రెడ్డి అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే బడిబాట ప్రచార జాతాను డీఈవో రవీందర్ రెడ్డి మంగళవారం పట్టణంలోని గాంధీ సెంటర్ వద్ద టిఎస్ యూటీఎఫ్ జెండా ఊపి ప్రారంభించారు.IMG-20250603-WA0071ఈ సందర్బంగా మాట్లాడుతూ బడి మనదే - బడి బాధ్యత మనదే అనే నినాదంతో , మన ఊరు పిల్లలను మన ఊరు ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిద్దాం, నాణ్యమైన విద్యను పొందుదాం ఫీజుల భారాన్ని తగ్గించుకుందాం , ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దామని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచుటకు ఊరూరా ప్రచార జాతా నిర్వహించడంచడం పట్ల టిఎస్ యూటీఎఫ్ ను అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా, మౌలికల వసతులను కల్పించి, ఇంగ్లీష్ మీడియంతో పూర్వ ప్రాథమిక విద్యను కూడా ప్రాథమిక పాఠశాలలో ప్రవేశపెడుతున్నామని, విద్యార్థులకు రెండు జతలు యూనిఫామ్ లు, మధ్యాహ్న భోజనం, వారానికి మూడు కోడిగుడ్లు పెడుతూ పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. విశాలమైన తరగతి గదులు, ఆట స్థలాలు, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ తరగతి గదులు లైబ్రరీ,ఆటపాటలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో నిపుణులైన ఉపాధ్యాయులతో ఒత్తిడి లేని చదువు అందించబడుతుందని,పిల్లల మానసిక ఆరోగ్యానికి వ్యక్తిత్వ వికాస్వానికి అణువుగా ప్రభుత్వ పాఠశాల రూపుదిద్దుకుంటున్నాయని, జిల్లా విద్యాశాఖ,ఉపాధ్యాయుల సమిష్టి కృషితో ఈ సంవత్సరం పదవ తరగతి ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే మొదటి స్థానం పొందామని, తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రయివేట్ పాఠశాలల మోజులో పడకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేటు విద్యా వ్యాపారం విచ్చలవిడిగా  సాగుతున్నదని,సంపాదన సగం పైగా పిల్లల చదువుల కోసమే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, , విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని మేము భరోసా ఇస్తున్నామని, సామాజిక బాధ్యత కలిగిన ఉపాధ్యాయ సంఘం గా తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ బడుల బాగు కోసం పిల్లలందరికీ అంతరాలు లేని నాణ్యమైన విద్యను అందించడానికి నిరంతరం కృషి చేస్తున్నామని, గురుకులాలతోపాటు ప్రభుత్వ పాఠశాలను కూడా సెమీ రెసిడెన్షియల్ పద్ధతిలో అభివృద్ధి పరచాలన్నారు.ఈ కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ఆజాద్ చంద్రశేఖర్,మండల విద్యాశాఖ అధికారి మహంకాళి బుచ్చయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ యాకూబ్, జిల్లా ఉపాధ్యక్షులు నామ వెంకటేశ్వర్లు, కోశాధికారి కె. నాగమల్లయ్య, జిల్లా కార్యదర్శి ఎన్ జనార్దన చారి, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు కె బిక్షపతి, మండలాల బాధ్యులు యు వెంకటేశ్వర్లు, జి రంజిత్, కె వంశీ కృష్ణ, ఆర్ విజయ్ కుమార్, జి శేఖర్, బి పార్వతి రాథోడ్, ఎండి నాగుమీరా, ఓ చైతన్య, రాయలు, వెంకటేశ్వర్లు, మధు, వెంకన్న, రవీందర్, శరత్, మహేందర్, మహేష్, ప్రేమ్ చందర్, ఎస్ఎఫ్ఐ నాయకులు అమీర్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?