మాడుగులపల్లి, మే 28 (క్విక్ టుడే న్యూస్):- మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు పద్మ శ్రీ మంద కృష్ణ మాదిగ కు జరుగు సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎం.జె.ఎఫ్ (మాదిగ జర్నలిస్ట్ ఫోరం) మాడుగులపల్లి మండల ఉపాధ్యక్షులు చిట్యాల సురేందర్ మాదిగ పిలుపునిచ్చారు.

దళిత జాతి ముఖ్యంగా మాదిగల, మాదిగ ఉపకులాల సంక్షేమం కోసం, ఎస్సీ వర్గీకరణ కొరకు, గత మూడు దశాబ్దాలుగా అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపకులు, మంద కృష్ణమాదిగ కు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ శ్రీ అవార్డు అందుకున్న తదుపరి మొదటి సారిగా వరంగల్ పట్టణానికి ఈ నెల 31వ తారీకున విచ్చేస్తున్నందున ఎమ్మార్పీఎస్, ఎం.జె.ఎఫ్, ఎం.ఈ.ఎఫ్, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులందరు, ఈ కార్యక్రమానికి భారీ జన సమూహంతో తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.