యూత్ లీడర్స్ విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు శ్రేయోభిలాషులతో ఎంఈఓ సమావేశం
ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాన్ని అనుసరించి మండల విద్యాధికారి మహంకాళి బుచ్చయ్య శుక్రవారం యూత్ లీడర్స్, విద్యాభిమానులు, పాఠశాల శ్రేయోభిలాషులతో, ప్రధానోపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల నమోదు పెంపునకు, గ్రామంలో అక్షరాస్యత పెంపునకు పూర్తి సహకారం తెలిపిన గ్రామ పెద్దలు ఎక్కటి చిన్న నాగిరెడ్డి, సోమ సత్యనారాయణ చారి, రజిత ఐలయ్య, రేణుక తదితరులకు
పాఠశాల పక్షాన హృదయపూర్వక ధన్యవాదములు తెలియ జేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, గ్రామ పెద్దలు ఎక్కటి చిన్న నాగిరెడ్డి, సోమ సత్యనారాయణ చారి, రజిత, ఐలయ్య, రేణుక, ప్రాథమిక ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఎండి యాకూబ్, అలీ, రోజా రాణి, యాక మధు, యాకేందర్, ఉమామహేశ్వరి, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు