Araku Tour : అరకు పర్యాటకం ఆహ్లాదభరితం.. ఈ టూర్ ప్యాకేజీ వివరాలు..
ఇక్కడ ఉన్నా లోయలు, జలపాతాలు, వాగులు, పకృతి అందాలు చూసి సాగిపోయే ఈ జర్నీ జీవితాంతం కూడా ఎంతో గుర్తుండిపోతుంది. ఆంధ్ర ఊటీగా పేరు ఉన్న అరకు వ్యాలీని చూడాలి అనుకుంటే అరకులోయ అందాలు వర్ణించేందుకు కవితలు కూడా సరిపోవు అనే పేరు కూడా ఉన్నది. మీరు కనుక అరకులోయ చూడాలనుకుంటే కేవలం 7000 ప్యాకేజీ తో మీరు ఎంచక్కా అరకులోయ చూడొచ్చు.
ఈ సమ్మర్ లో అరకు వెళ్లాలి అని ప్లాన్ చేసుకున్నట్లయితే. మండుతున్న ఈ వేసవిలో పకృతి అందాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ప్రాంతాలను చూడాలని అనుకుంటే.తక్కువ ధరలో ఉండే టూర్ ప్యాకేజీల కోసం ఎదురు చూస్తున్నట్లయితే. మీలాంటి వారి కోసమే తెలంగాణ టూరిజం వేర్వేరు రకాల ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకువచ్చింది.bఇందులో అరకు టూర్ ప్యాకేజీ కూడా ఉన్నది.
కేవలం 7000 కన్నా తక్కువ టిక్కెట్ ధరతో నాలుగు రోజులపాటు పలురకాల ప్రాంతాలను కూడా చూపిస్తున్నారు.ఈ టూర్ ప్యాకేజీని హైదరాబాద్ నుండి ఆపరేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం చూద్దాం.. పచ్చని పకృతి స్వచ్ఛమైన గాలి, కలుషితం లేని గిరిజనుల ప్రేమ కావాలి అనుకుంటే అందాల చల్లని అరకు వెళ్లాల్సిందే ఇక్కడ చల్లనైన వాతావరణం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది.
అరకు పకృతి అందాలు చూసేందుకు ప్రతి ఏటా దేశ,విదేశాల నుండి కూడా పర్యటకులు ఎక్కువ సంఖ్యలో వస్తూ ఉంటారు. ఈ తరుణంలోనే అరకు అందాలను చూడటానికి తెలంగాణ టూరిజం ప్రత్యేకమైన ఒక ప్యాకేజీని ప్రకటించింది. Araku tour -Telangana tourism అనే పేరుతో ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుండి ఆపరేట్ చేయనున్నారు. ఈ టూర్ ప్యాకేజీ అనేది నాలుగు రోజులు పాటు ఉంటుంది.
ప్రతి బుధవారం తేదీలలో మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. అరకు టూర్ ప్యాకేజీ ధర వచ్చేసి పెద్దలకు మాత్రం రూ.6,999, టికెట్ ధర ఉండగా పిల్లలకు అయితే రూ.5,999 గా ఉన్నాయి.ఈ టూర్ ప్యాకేజీ లో అన్నవరం, వైజాగ్,ఆర్కే బీచ్, సింహాచలం, బొర్రా గుహలు,కైలాసగిరి, అనంతగిరి ప్రాంతాలను కూడా మీరు చూడవచ్చు. సాయంత్రం హైదరాబాదులోని పర్యటక భవనం నుండి స్టార్ట్ అవుతారు. వైజాగ్ కి ఉదయం 6:00 కల్లా చేరుతారు.
తరువాత హోటల్ కి వెళ్లి ఫ్రెషప్ అవుతారు. Kailasagiri,Simhachalam Rushikonda తో పాటుగా సబ్ మైరైన్ మ్యూజియం ను కూడా మీరు చూడవచ్చు. వైజాగ్ బీచ్ ను సాయంత్రం చూస్తారు. రాత్రి వైజాగ్ లోనే బస చేస్తారు. అరకు ఉదయం 6:00 గంటలకు చేరుకుంటారు. Tribal museum, Ananthagiri coffee plantetion, Borracaves, Dhisma Dance ను చూస్తారు. రాత్రి అరకు లోనే బస చేస్తారు.తర్వాత అరకు నుండి అన్న వారానికి చేరుకుంటారు.
దర్శనం అయిన తర్వాత హైదరాబాద్ కి బయలుదేరతారు. హైదరాబాదుకు ఉదయం 7:00 కల్లా చేరుకుంటారు. ఈ జర్నీ మొత్తం కూడా నాన్ ఏసీ బస్సులోనే ఉంటుంది. ఇప్పుడు ఈ ప్యాకేజీ వివరాలు తెలుసుకున్నారుగా ఇంకా ఎందుకు ఆలస్యం వెంటనే టికెట్ బుక్ చేసుకుని ఎంతో ఆహాదభరితమైన అరకులోయ అందాలు చూసేయండి. ఈ నాలుగు రోజుల్లో అరకు చుట్టూ ఉన్న ప్రాంతాలను అన్నింటినీ కూడా చుట్టేయండి. ఈ టూర్ అనేది మీ జీవితాంతం కూడా ఎంతో గుర్తుండిపోయేలా చేస్తుంది..