Nalgonda : మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలి

కమిషనర్ కు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సమ్మె నోటీసు

Nalgonda : మున్సిపల్ కార్మికులందరినీ రెగ్యులరైజ్‌ చేయాలి

Nalgonda : నల్లగొండ,. ఫిబ్రవరి 10 (క్విక్ టుడే) : కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్‌ చేయాలని మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా, కేంద్ర కార్మిక సంఘాలు చేపట్టిన  ఫిబ్రవరి 16 సమ్మెలో మున్సిపల్ కార్మికులు పాల్గొంటారని, నల్గొండ మున్సిపల్ కమిషనర్ కు శనివారం మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మిక సంఘాల జె.ఏ.సి నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దుచేసి మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

పారిశుద్ధ్య నిర్వహణ బాధ్యతలను పరోక్షంగా పెద్దపెద్ద కంపెనీల పరం చేస్తున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు ప్రజల సొమ్ము కంపెనీల పరం అవుతుందని అన్నారు. 11వ పిఆర్సి చైర్మన్ సిఫారసుల చేసిన వేతనాలు జీవో నెంబర్ 60 ప్రకారం  19,000 ,22,500 ,31,000 కేటగిరీల వారిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదాల్లో మరణించిన మున్సిపల్ కార్మికులకు 25 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలని దహన సంస్కారాలకు రూ.30 వేలు ఇవ్వాలని కోరారు. ఆదివారాలు పండగ సెలవులు ఎనిమిది అమలు చేయాలని, వాటర్ వర్క్స్ విభాగంలో కూడా అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్మికులకు మొదటి ప్రాధాన్యతగా ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. దేశవ్యాప్తంగా కార్మికుల హక్కుల రక్షణ కోసం జరుగుతున్న ఫిబ్రవరి 16 సమ్మెలో మున్సిపల్ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.

Read Also ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎండి సలీం, ఐ ఎన్ టి యూ సి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి మోహినోద్దీన్ , సిఐటియు జిల్లా సహాయ  కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, ఐ ఎన్ టి యు సి జిల్లా ఉపాధ్యక్షులు అవుట రవీందర్, మున్సిపల్ జిల్లా కార్యదర్శి సుంకిశాల వెంకన్న, తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్  పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, జె ఏ సి నాయకులు  పందుల లింగయ్య, సంతోష్, ఎండి లతీఫ్, మాదారం భాస్కర్, ఏ శ్రీదేవి, కె.ధనమ్మ, జి జానమ్మ, పెరిక కళ్యాణ్, యాదగిరిరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Read Also వరంగల్ లో జరిగే సన్మాన సభను విజయవంతం చేయండి

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?