రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి

రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి

తొర్రూరు మే 17(క్విక్ టుడే న్యూస్):- రక్తపోటు అనేది నిశ్శబ్ద వ్యాధి అని, దానిని అదుపులో పెట్టుకోవాలని ఏరియా ఆసుపత్రి వైద్యుడు చింత రమేష్ అన్నారు.IMG-20250517-WA0040

డివిజన్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అనంతరం రోగులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ రమేష్ మాట్లాడుతూ.....
గతంలో వయస్సు పైబడిన వారు మాత్రమే రక్తపోటు సమస్యను ఎదుర్కొనే వారిని, ప్రస్తుతం యుక్త వయస్సు వారు సైతం బాధితులుగా మారుతున్నారన్నారు. శారీరక శ్రమ తగ్గడం, ఉరుకుల పరుగుల జీవితం, ఆహార అలవాట్లు, అధికంగా ఉప్పు తీసుకోవడం, కొవ్వు పదార్థాలు భుజించడం, ఎక్కువ సమయం కూర్చునే జీవనశైలి, మద్యపానం వంటి అనేక అంశాలు రక్తపోటుకు కారణం అవుతాయన్నారు. శారీరక వ్యాయామం, బరువుకు తగిన స్థాయిలో నీరు తీసుకోవాలని తెలిపారు.
కూరగాయలు, పండ్లు, పప్పులు, ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యులు మీరాజ్, ప్రియాంక, నందన, మానస, డీ పీ ఎం ఓ వనాకర్ రెడ్డి, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read Also వీర జవాన్ల త్యాగం వెల కట్టలేనిది

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?