తెలుగు వృత్త్యంతర శిక్షణలో జ్ఞాన దర్శిని పుస్తక సమీక్ష
గ్రామ చరిత్ర బడి గుడి సంస్కృతి సాంప్రదాయాల పై జ్ఞాన దర్శిని పేరుతో ఎల్లూరు పాఠశాల ప్లాటినం జూబ్లీ సంచికను తీసుకు రావడంలో కృషి చేసినందుకుగాను తెలుగు భాషోపాధ్యాయుల ఆధ్వర్యంలో పుస్తక సంపాదకులు కంటె నిరంజనయ్యను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పుస్తక సమీక్షకులు డా.తూర్పింటి నరేశ్ మాట్లాడుతూ..." ఒక గ్రామ పుస్తకాన్ని ప్రచురించడంలో ఉండే ప్రయాసలను అధిగమించి పుస్తకాన్ని అందంగా ఆకర్షణీయంగా చరిత్ర ఆధారాలతో ఇతర గ్రామాలకు స్ఫూర్తిని అందించే విధంగా ఉందని.. కొల్లాపూర్ సురభి రాజుల పాలనను.. .క్రీ.శ 1840 లో జటప్రోలు నుండి కొల్లాపూర్ కు రాజధానిని మార్చిన విషయాన్ని, లక్ష్మణరావు హయాంలో జరిగిన *ఎల్లూరు లడాయిని*...పూర్వం కొలుముల పల్లె గా ...కమ్మరులు కొలుములు నడిపేవారని...అగస్తేశ్వరం..సోమేశ్వరం దేవాలయాలను ఎల్లోజు... మల్లోజు... సోమోజులు నిర్మించారని... .పెద్దవాడెైన ఎల్లోజు పేరున ఎల్లూరును నిర్మించారని .. కొల్లాపూర్ ప్రాంతంలో క్రీ..శ.. 1905 నాటికే సుసంపన్న రాజ్యమనీ... ఈ ప్రాంత రాజులు ఏరోప్లేన్స్ నడిపేవారని.... ప్రస్తుతమున్న జఫర్ మెైదానాన్ని ఏరోడ్రమ్ గా ఉపయోగించారని అలనాటి కొల్లాపూర్ చరిత్రను కళ్లకు కట్టినట్లు వీక్షకుల యవనికపెై సజీవ సాక్ష్యంగా ముందుంచారు. ఊరుపేరును ఇంటి పేరుగా మార్చుకున్న ఎల్లూరు నరసింగకవి గురించి చక్కగా వివరించారు. రాచకన్యకా పరిణయం. ప్రబంధం గురించి... మాధవరాయల చంద్రికా పరిణయం గురించి ..." తెల్పారు. ఈ కార్యక్రమంలో
ముఖ్య అతిథిగా స్టేట్ ఆర్జెడి ఏడి శ్రీమతి అనసూయ, మరియు కోర్సు డైరెక్టర్ శ్రీమతి ఉమాదేవి, జిల్లా విద్యాశాఖ అధికారి ఏఎమ్ఓ మహానంది
నిర్వాహకులు పయ్యావుల కృష్ణయ్య, సువర్ణ , రమణమ్మ , పార్వతి , చెన్న పద్మ ,రాజా రెడ్డి , డాక్టర్ తూర్పింటి నరేశ్ కుమార్, షావుకారి శాంతన్న,రూప్ అధ్యక్షులు
సుధాకరాచారి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.