Maganta Raghava: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్ గా మాగంట రాఘవకు అనుమ‌తి

 Maganta Raghava: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్ గా మాగంట రాఘవకు అనుమ‌తి

Maganta Raghava: ఒంగోలు : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మ‌రో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ ఈ కేసులో నిందితుడిగా ఉన్నవిష‌యం తెలిసిందే. ఆయ‌న ఇప్పుడు సీబీఐ కేసులో అప్రూవర్ గా మారారు. ఇప్పటికే మాగుంట రాఘవ ఈడీ కేసులో అప్రూవర్ గా మారగా తాజాగా సీబీఐ కేసులోనూ అప్రూవర్ గా మారడానికి ఆయ‌న‌ చేసుకున్న దరఖాస్తును రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. దినేశ్ అరోరా, శరత్ చంద్రారెడ్డి ఇప్పటికే అప్రూవర్లుగా మారగా   మాగుంట రాఘవ సైతం అఫ్రూవర్ గా మారడంతో ఈ కేసుపై ఉత్కంఠ రేపుతోంది. ఈ కేసులో ఇటీవలే కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసిన విష‌యం తెలిసిందే.. లిక్క‌ర్ కుంభకోణంలో మాగుంట పాత్ర ఉన్నట్లు ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్లు, పలువురి రిమాండ్‌ అప్లికేషన్లలో ఈడీ పేర్కొన్నది. ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేతలకు రూ.100 కోట్ల మేర సౌత్‌ గ్రూపు ముడుపులు చెల్లించినట్లు ఈడీ ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే..

ఈ సౌత్‌ గ్రూపులో మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్‌, అరబిందో ఫార్మా సంస్థ డైరెక్టర్‌ శరత్‌చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ క‌విత‌ భాగస్వాములుగా ఉన్న‌ట్లు వెల్ల‌డిస్తోంది. సమీర్‌ మహేంద్రుకు చెందిన ఇండోస్పిరిట్స్‌ కంపెనీలో రాఘవ్‌కు 32.5 శాతం వాటాలు ఉన్న‌ట్లు ఈడీ విచార‌ణ‌లో తేలింది. మద్యం విధానం రూపకల్పనలో మాగుంట శ్రీనివాసులురెడ్డిపై ఆధారాలు సేకరించింది. ఢిల్లీలోని అత‌డి నివాసంలో కూడా సమావేశాలు జరిగాయని, వాటికి అరుణ్‌ పిళ్లై, కవిత మాజీ ఆడిటర్‌ బుచ్చిబాబు పాల్గొన్న‌ట్లు ఈడీ స్ప‌ష్టం చేసింది. మాగుంట నివాసంలో సీబీఐ, ఈడీ సోదాలు కూడా నిర్వహించాయి. ఆయా హోటళ్లలో జరిగిన సమావేశాలు, భాగస్వామ్యం, సౌత్‌ గ్రూపు వ్యవహారాలు, ఇతర నిందితులతో సంబంధాలు, ముడుపుల చెల్లింపు, నగదు లావాదేవీలు వంటి అంశాల‌పై ఈడీ ప‌లు మార్లు ప్రశ్నించింది.  

Read Also జగన్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు ఆపాలి?

గతంలో మాగుంట రాఘవ్ రెడ్డి  చాలా కాలం పాటు ఈడీ కేసులో జైల్లో ఉన్నారు. మాగుంట శ్రీనివాసులరెడ్డికి వైఎస్ జగన్ టిక్కెట్ నిరాకరించడం, పార్టీ వ్యవహారాల్లో పట్టించుకోకపోవడం వ‌ల్ల ఆయ‌న వైసీపీకి రాజీనామా స‌మ‌ర్పించారు. టీడీపీ నుంచి మాగుంట రాఘవరెడ్డి ఈ సారి ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు చెబుతున్నారు. కాగా ఇంత వరకూ ఆయ‌న‌ చంద్రబాబును క‌లువ‌లేదు. గ‌తంలో ఓ సారి టీడీపీ నుంచి  పోటీ చేసి ఓడిపోయారు. అనంత‌రం వైసీపీలో చేరి ఎంపీగా గెలిచారు. మాగుంట కుటుంబం ఎంతో కాలం నుంచి రాజ‌కీయాల్లో ఉంటున్నా.. ఇప్ప‌టి వ‌ర‌కు వారి కుటుంబంపై ఎలాంటి స్కాం ఆరోప‌ణ‌లు రాలేదు. ఇప్పుడు లిక్కర్ స్కాం కేసు వారి మెడ‌కు చుట్టుకుంది. పెద్ద మొత్తంలో మాగుంట కుటుంబానికి మద్యం కంపెనీలు ఉండ‌గా ఇప్పుడు స్కాంలో ఇరుక్కుపోయింది.

Read Also పల్లా సింహాచలంను పరామర్శించిన బీవీ రామ్ 

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?