Nalgonda : మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం
నల్లగొండ విజయసంకల్ప సభలో ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్
Nalgonda : నల్గొండ జిల్లా ప్రతినిధి, మార్చి1 (క్విక్ టుడే) : గత 10 ఏళ్లులగా దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వం బలపర్చాలని, ప్రధాని నరేంద్ర మోడీతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఉత్తర ప్రదేశ్ డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్ అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో క్లాక్కులను సెంటర్లో కృష్ణమ్మ విజయసంకల్ప సభ ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సభకు ఈయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో మూడోసారి బిజెపి అధికారంలోకి వస్తుందని మళ్లీ ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపడతారన్నారు.
దేశవ్యాప్తంగా 400 సీట్లు బిజెపికి వస్తాయని తెలంగాణలో కూడా అత్యధిక సీట్లు బిజెపికి వచ్చే విధంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలి అన్నారు. బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గత పదివేలుగా తెలంగాణ ఉద్యమం పేరుతో కెసిఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేసి లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అత్యధిక స్థానాలు గెలవడం ఖాయం అన్నారు.
కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కాసం వెంకటేశ్వర్లు, దుగ్యాల ప్రదీప్ కుమార్, ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, గోలి మధుసూదన్ రెడ్డి, నూకల నరసింహారెడ్డి, వీరేలీ చంద్రశేఖర్, శ్రీదేవి రెడ్డి, గార్లపాటి జితేంద్రకుమార్, బండారు ప్రసాద్, నూకల వెంకట్ నారాయణరెడ్డి, పోతపాక సాంబయ్య, శ్రీనివాసరావు, దాయం భూపాల్ రెడ్డి, దాసోజు యాదగిరి చారి, పోతేపాక లింగస్వామి, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, చింత ముత్యాలరావు, కొండ భవాని ప్రసాద్, ఐతరాజు సిద్దు, బోగరి అనిల్, భిక్షం రెడ్డి, నాగిరెడ్డి తదితరులు ఉన్నారు.