Dandempalli Sattaiah,: గ్రామీణ భారత్ బంద్ విజ‌య‌వంతం చేయాలి

-వెల్ఫేర్ బోర్డు రక్షణ కోసం ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త కార్మిక స‌మ్మె

Dandempalli Sattaiah,: గ్రామీణ భారత్ బంద్ విజ‌య‌వంతం చేయాలి

Dandempalli Sattaiah : నల్లగొండ. ఫిబ్రవరి 10. ( క్విక్ టుడే) : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ 1996 కేంద్ర వెల్ఫేర్ బోర్డు చట్టం రక్షణ కోసం కోసం ఫిబ్రవరి 16న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మె గ్రామీణ భారత్ బంద్ జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, ఐ ఎన్ టి యూ సి జిల్లా కార్యదర్శి సుంకిషాల వెంకన్న, భావన నిర్మాణ కార్మిక సంఘాల పట్టణ అధ్యక్షులు సలివొజు సైదాచారి, శాంబిరెడ్డి పిలుపునిచ్చారు. శనివారం సుందరయ్య భవన్లో భాను నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన నిర్మాణంలో వాడే ఇసుక, ఇటుక సిమెంటు, స్టీలు, పెయింట్ తదితర ముడి సరుకుల ధరలను నియంత్రించాలన్నారు.

1998 సెస్సు చట్టం ప్రకారం సెస్సునిధులను సమర్ధవంతంగా వసూలు చేసి, వాటిని కొత్త సంక్షేమ పథకాల కోసం నిర్మాణరంగ కార్మికులకు ఖర్చు చేయాలన్నారు. అసెంబ్లీలో ప్రకటించిన లక్ష మోటార్ సైకిళ్లను కార్మికులకు వెంటనే ఇవ్వాలన్నారు. పెండింగ్ లో ఉన్న నష్టపరిహారాలకు తక్షణమే నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక శాఖలో బ్రోకర్ల వ్యవస్థను నిర్మూలించాలన్నారు. అర్హులైన కార్మికులకే నష్టపరిహారాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాద మరణానికి 10 లక్షల రూపాయలు పెంచాలన్నారు, సహజ మరణానికి ఐదు లక్షలకు పెంచాలన్నారు. ప్రసూతి పెళ్లి కానుకకు లక్ష రూపాయలకు పెంచాలన్నారు. వెల్ఫేర్ బోర్డు నుండి అక్రమంగా దారి మళ్లించిన 1005 కోట్లరూపాయలను మరియు బీసీ బందుకు కేటాయించిన 250 కోట్లను తిరిగి బోర్డులో జమ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కార్మిక శాఖలో ఖాళీగా ఉన్న ALO, ACL, DCL, జూనియర్ సీనియర్ అసిస్టెంట్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

Read Also పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి!

ఫిబ్రవరి 16 సమ్మె సందర్భంగా పట్టణంలోని అన్ని అడ్డాలలో విస్తృతంగా 12 13 14 తేదీలలో కరపత్రాల పంపిణీ చేయాలని, 14 వ తేదీ సాయంత్రం బైక్ ర్యాలీ 16 సమ్మె సందర్భంగా పెద్ద గడియారం సెంటర్లో జరిగే సభలో భవనిర్మాణ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల జేఏసీ  (సిఐటియు  ,ఏఐటీయూసీ, బి ఆర్ టి యు ,ఐ ఎన్ టి యు సి)  నాయకులు అద్దంకి నర్సింహ్మ, గుండె రవికుమార్ ఎనమల్ల వెంకటేశం కత్తుల సహదేవ్ తదితరులు పాల్గొన్నారు.

Read Also ఆర్టీసీ బస్టాండ్ లో సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?