విద్యుదాఘాతంతో ఎద్దు మృతి!..
On
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి చెందిన సంఘటన మండలంలోని జమస్థాపురం గ్రామ శివారు రూప తండాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం రైతు భూక్య రవి తన పొలం వద్ద ఎద్దులను మేత మేపుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్దకు ఒక ఎద్దు వెళ్లగానే షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది.వ్యవసాయ పనులకు ప్రధాన ఆధారమైన ఎద్దు మృతి తో కుటుంబం ఆర్ధికంగా నష్టపోవడంతో రైతు దంపతులు కన్నేరుమున్నీరుగా విలపించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతోనే ఎద్దులు మృతి చెందిందని బాధిత రైతులు ఆరోపించారు.ప్రభుత్వం ఆర్థిక సాయం అందచేసి కుటుంబాన్ని ఆదుకోవాలని తొర్రూరు పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ రావు అధికారులను కోరారు.
Read Also ఆడపడుచుల వివాహాలకు ఆర్థిక సహాయం అందజేత
Read Also రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదు
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...