తెలంగాణ‌కు మొద‌టి విల‌న్ కాంగ్రెస్‌:-కేసీఆర్‌

తెలంగాణ‌కు మొద‌టి విల‌న్ కాంగ్రెస్‌:-కేసీఆర్‌

వ‌రంగ‌ల్‌, ఏప్రిల్ 27 (క్విక్ టుడే న్యూస్‌):-ఆనాడు, ఈనాడు, ఏనాడైనా తెలంగాణకు మొదటి విలన్​ కాంగ్రెస్​ పార్టీనేనని బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​  ​తీవ్రస్థాయిలో ఉద్ఘాటించారు. అప్ప‌టి ప్ర‌ధాని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ 1956లో తెలంగాణ‌ను బలవంతంగా ఆంధ్రతో కలిపార‌ని తెలిపారు. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ ప్ర‌భుత్తం నిరంకుశంగా అణిచివేసింద‌ని ధ్వజమెత్తారు. వరంగల్​లోని ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్​ఎస్​ రజతోత్సవ సభలో ఆయన కీలక ప్రసంగం చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. "ప్రజలు దీవిస్తే పదేళ్లపాటు ధగధగలాడే తెలంగాణను తయారు చేసుకున్నాం. 1969లో మూగబోయిన తెలంగాణ ఉద్యమానికి మళ్లీ జీవం పోశాం. కొండా లక్ష్మణ్​ బాపూజీ నివాసమైన జలదృశ్యం వేదికగా టీఆర్​ఎస్​ ఆవిర్భావం జరిగింది. ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని ఆనాడు చెప్పాను, 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్ని బాధలు పడ్డారో నాకు తెలుసు" అని అన్నారు.  "పదేళ్లపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాం. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి సాగుభూమిని గణనీయంగా పెంచాం. మూడేళ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాం. అద్భుతమైన తెలంగాణను నిర్మించుకున్నాం. పంజాబ్‌ను తలదన్నేలా పంటలు పండే తెలంగాణను నిర్మించుకున్నాం. షేర్‌షా కాలం నుంచి స్వాతంత్య్రం వచ్చేవరకు రైతుల నుంచి ఎన్నో పన్నులు వసూలు చేశారు. రైతుల నుంచి పన్నులు వసూలు చేసిన వారే తప్ప.. ఇప్ప‌టి వ‌ర‌కు రైతుకు మేలు చేసిన వాళ్లు లేరు. రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని రైతుబంధు పథకం తీసుకువచ్చాను. రైతులు ఆత్మహత్య చేసుకుంటే రైతుబీమా అమలు చేసి రైతు కుటుంబాలను ఆదుకున్నాం" అని అన్నారు. వలసవాదుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు ఒక్కడినే బయలుదేరానని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం నేను బయలుదేరిన నాడు కొందరు వెటకారం చేశారన్నారు. అన్నింటినీ అధిగమించి పోరాడి తెలంగాణను సాధించానని కేసీఆర్​ వివరించారు.  "కాంగ్రెస్​ నేతలు ఎన్నికల ముందు ఎన్నెన్నో చెప్పారు. దిల్లీ నుంచి వచ్చిన నకిలీ గాంధీలు ఎన్నో హామీలు ఇచ్చారు. పింఛను రూ.2 వేలు ఉంటే రూ.4వేలు ఇస్తామన్నారు. మేం రైతుబంధు రూ.10 వేలు ఇస్తే రూ.15 వేలు ఇస్తామని అన్నారు. చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్నారు, రూ.2 లక్షల రుణమాఫీని ఒక్క సంతకంతో రద్దు చేస్తామన్నారు. కల్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని అన్నారు. ఈ హామీల‌న్నీ ఇప్పుడు ఏమి అయ్యాయి. 2014కు ముందు ఉన్న‌ పరిస్థితులే ఇప్పుడు మళ్లీ వచ్చాయి. భూముల ధరలు ఎందుకు తగ్గాయి, నీళ్లు ఎక్కడికి పోయాయి. వడ్లు కొనే దిక్కు లేదు, కల్లాల్లో రైతులు ఏడుస్తున్నారు. పేదలు వేసుకున్న గుడిసెలను హైడ్రా పేరుతో కూల్చుతున్నారు. ఆనాడు చెరువుల్లో పూడికలు తీసిన బుల్డోజర్లు ఇవాళ ఇళ్లను కూలుస్తున్నాయి. నా కళ్లముందే తెలంగాణ ఇంత ఆగమైపోతుందని అనుకోలేదు" అని కేసీఆర్ అన్నారు. "ప్రజలు దీవిస్తే పదేళ్లపాటు ధగధగలాడే తెలంగాణను తయారు చేసుకున్నాం. 1969లో మూగబోయిన తెలంగాణ ఉద్యమానికి మళ్లీ జీవం పోశాం. కొండా లక్ష్మణ్​ బాపూజీ నివాసమైన జలదృశ్యం వేదికగా టీఆర్​ఎస్​ ఆవిర్భావం జరిగింది. ఉద్యమ జెండాను దించితే నన్ను రాళ్లతో కొట్టి చంపమని ఆనాడు చెప్పాను, 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు ఎన్ని బాధలు పడ్డారో నాకు తెలుసు" అని అన్నారు.  

వలసవాదుల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు ఒక్కడినే బయలుదేరానని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం నేను బయలుదేరిన నాడు కొందరు వెటకారం చేశారన్నారు. అన్నింటినీ అధిగమించి పోరాడి తెలంగాణను సాధించానని కేసీఆర్​ వివరించారు. "కాంగ్రెస్​ ప్రభుత్వానికి కొన్నాళ్లు సమయం ఇవ్వాలని ఇన్నాళ్లు బయటకు రాలేదు, ఏడాదిన్నర పూర్తయ్యింది ఇంకెప్పుడు చేస్తారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి తెలివితో పని చేయాలి. ఎక్కడ పోగొట్టుకున్నామో మళ్లీ అక్కడే సాధించాలి. మాట్లాడితే బీఆర్​ఎస్​ పై నిందలు వేస్తున్నారు. భూములు అమ్మొచ్చు.. అభివృద్ధి చేయొచ్చు కానీ యూనివర్సిటీ బూములు అమ్ముతారా" అని కేసీఆర్​ ప్రశ్నించారు. "వైఎస్​ఆర్​ తీసుకువచ్చిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నేను రద్దు చేయలేదు. ఎవరు తెచ్చినా బాగున్న పథకాన్ని కొనసాగించాలని చెప్పా. పేరు కూడా మార్చకుండా రాజీవ్​ ఆరోగ్య శ్రీ పథకాన్ని కొనసాగించాం. బీఆర్​ఎస్​ సభ పెట్టుకుంటే ఆటంకాలు సృష్టించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్​ఎస్​ ప్రభంజనాన్ని ఎవరూ ఆపలేరు. ప్రభుత్వాన్ని సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రశ్నించిన వారిపై పోలీసు కేసులు పెడుతున్నారు, ప్రజలపై కేసులు పెడుతున్న పోలీసులు గుర్తించుకోవాలి. మళ్లీ వచ్చేది బీఆర్​ఎస్​ ప్రభుత్వమే, ఆపటం ఎవరితరం కాదు. పోలీసులకు రాజకీయాలు ఎందుకు?. కార్యకర్తలకు బీఆర్​ఎస్​ లీగల్​ సెల్​ అండగా ఉంటుంది" అని హామీ ఇచ్చారు.

Read Also జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాచ‌కొండ‌ సీపీ 

IMG-20250427-WA0032

Read Also "ఏప్రిల్ 28న చలో నల్గొండ"... పూలే, అంబేద్కర్ జనజాతర 

Tags:

Join Us @ Social Media

Latest News

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్   ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
పెబ్బేర్‌, ఏప్రిల్ 22 (క్విక్ టుడే న్యూస్‌): -ఇంట‌ర్మీడియ‌ట్ ఫ‌లితాల‌లో మోడ‌ల్ క‌ళాశాల పెబ్బేర్ ఉమ్మ‌డి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోనే ప్ర‌థ‌మ స్థానాన్ని సాధించి స‌త్తాచాటుకుంది. ఇంటర్ ద్వితీయ...
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?
Investment Tips: కోటీశ్వరులు అవ్వాలనే ఆలోచనతో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారా?