Drugs in Vizag : విదేశాల నుంచి వైజాగ్ పోర్ట్‌కు వచ్చిన భారీ కంటెయినర్.. అందులో 25 వేల కిలోల డ్రగ్స్.. సీజ్ చేసిన సీబీఐ

Drugs in Vizag : విదేశాల నుంచి వైజాగ్ పోర్ట్‌కు వచ్చిన భారీ కంటెయినర్.. అందులో 25 వేల కిలోల డ్రగ్స్.. సీజ్ చేసిన సీబీఐ

Drugs in Vizag : విదేశాల నుంచి మన దేశానికి భారీ వస్తువులు ఏవైనా తీసుకురావాలంటే అందరూ ఎంచుకునేది సముద్ర మార్గమే. సముద్ర మార్గం ద్వారా పెద్ద పెద్ద ఓడల ద్వారా భారీ కంటెయినర్లలో వస్తువులను ఒక దేశం నుంచి మరో దేశానికి తరలిస్తూ ఉంటారు. అయితే.. ఒక్కోసారి ఆ కంటెయినర్లలో అక్రమంగా కొన్ని వస్తువులను తరలిస్తూ ఉంటారు. అవి కొన్ని దేశాల్లో లీగల్ ఉంటే మరికొన్ని దేశాల్లో లీగల్ గా ఉండవు. 

తాజాగా విదేశాల నుంచి ఏపీలోని వైజాగ్ పోర్టుకు ఒక భారీ కంటెయినర్ వచ్చింది. ఆ కంటెయినర్ లో 25 వేల కిలోల డ్రగ్స్ ఉన్నాయి. అయితే.. ఆ కంటెయినర్ లో డ్రగ్స్ ఉన్నాయని ముందే ఇంటర్ పోల్ ద్వారా సమాచారం సీబీఐ అధికారులు చేరింది. దీంతో వెంటనే వైజాగ్ పోర్టుకు వెళ్లిన అధికారులు.. ఆ భారీ కంటైనర్ ను సీజ్ చేసి తనిఖీ చేయగా అందులో 25 వేల కిలోల డ్రగ్స్ బయటపడ్డాయి. ఆ ఇంటర్నేషనల్ డ్రగ్ రాకెట్ ను సీబీఐ అధికారులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. 

Read Also జగన్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు ఆపాలి?

22 -2

Read Also పల్లా సింహాచలంను పరామర్శించిన బీవీ రామ్ 

Drugs in Vizag : సీబీఐ, కస్టమ్స్ అధికారుల జాయింట్ ఆపరేషన్ గరుడ సక్సెస్

Read Also మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే.. టిడిపి పరిస్థితి ఏంటి?

సీబీఐ, కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను నిర్వహించారు. దీనికి ఆపరేషన్ గరుడ అని పేరు పెట్టారు. నిజానికి ఇంటర్ పోల్ అధికారుల నుంచి ఢిల్లీ సీబీఐ అధికారులకు సమాచారం అందింది. దీంతో వెంటనే ఢిల్లీ సీబీఐ అధికారులు.. వైజాగ్ లోని సీబీఐ, కస్టమ్స్ అధికారులకు సమాచారం చేరవేశారు. వెంటనే రంగంలోకి దిగిన ఈ టీమ్స్.. ఆ కంటెయినర్ విశాఖ పోర్టుకు రాగానే దాన్ని సీజ్ చేసి దాంట్లో తనిఖీలు చేపట్టారు. 

25 వేల కిలోల డ్రగ్స్ ను డ్రై ఈస్ట్ తో మిక్స్ చేశారు. ఆ కంటెయినర్ లో ఉన్నది డ్రగ్సే అని నార్కోటిక్స్ నిపుణులు టెస్ట్ చేసి కన్ఫమ్ చేయడంతో వెంటనే ఆ షిప్పింగ్ కంటైనర్ ను అధికారులు సీజ్ చేశారు. ఆ కంటైనర్.. బ్రెజిల్ లోని శాంటోస్ పోర్ట్ నుంచి జర్మనీలోని హ్యాంబర్గ్ మీదుగా వైజాగ్ పోర్ట్ కు వచ్చింది. ఈనెల 16న ఆ కంటైనర్ వైజాగ్ కు వచ్చినట్టు అధికారులు గుర్తించారు. 

వైజాగ్ లోని కన్సిగ్సీ అనే ప్రైవేటు కంపెనీ ఆ కంటైనర్ లో ఉన్న సరుకును బుక్ చేసుకున్నట్టు విచారణలో తేలింది. ఆ డ్రగ్స్ ను 1000 బ్యాగుల్లో నింపారు. ఒక్కో బ్యాగ్ బరువు 25 కిలోల ఉండటంతో మొత్తం 25 వేల కిలోల డ్రగ్స్ గా లెక్క తేలింది.  వెంటనే అధికారులు వైజాగ్ లోని కన్సిగ్సీ కంపెనీపై కేసు నమోదు చేశారు. ఆ కంపెనీ లావాదేవీలపై విచారణ చేస్తున్నారు.

22 -1

బ్రెజిల్ లో ఆ కంటైనర్ ఎక్కడి నుంచి వచ్చిందో ఆ కంపెనీ మీద కూడా అధికారులు కేసు నమోదు చేశారు. అయితే.. ఇలా విదేశాల నుంచి వైజాగ్ పోర్ట్ కు డ్రగ్స్ రావడం ఇదే కొత్తేమీ కాదు. ఇదివరకు కూడా చాలా సార్లు కంటైనర్ల ద్వారా విశాఖకు డ్రగ్స్ సరఫరా చేశారు.

ఇంటర్ పోల్ అధికారుల సమాచారంతో వైజాగ్ సీబీఐ అధికారులు చాలా సార్లు ఇలాంటి డ్రగ్స్ రాకెట్ ముఠాను పట్టుకున్నారు. సీబీఐ చాలా ఆపరేషన్లు చేసి మరీ డ్రగ్స్ రాకెట్ ను ఛేదిస్తోంది. అయినా కూడా విదేశాల నుంచి డ్రగ్స్ రాక మాత్రం ఆగడం లేదు. అది కూడా వేలకు వేల కిలోల డ్రగ్స్ వచ్చి చేరుతుండటంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?