TDP Candidate Gottipati Lakshmi : ఎన్నికల ప్రచారాన్ని మధ్యలో వదిలేసి ఆపరేషన్ చేసిన టీడీపీ అభ్యర్థిని..

TDP Candidate Gottipati Lakshmi : ఎన్నికల ప్రచారాన్ని మధ్యలో వదిలేసి ఆపరేషన్ చేసిన టీడీపీ అభ్యర్థిని..

TDP Candidate Gottipati Lakshmi : ఏపీలో ప్రస్తుతం ఎన్నికల హడావుడి నెలకొన్నది. ఇంకో 20 రోజుల్లో ఏపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈనేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. 

అధికార వైసీపీ ఒకవైపు అయితే.. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి మరోవైపు అన్నట్టుగా ఉంది. ఏపీలో ఎన్నికలు మే 13న జరగనున్నాయి. లోక్ సభ, అసెంబ్లీ రెండు ఎన్నికలు ఒకే రోజు జరగనున్నాయి. ఓటర్ ఒకేసారి రెండు ఓట్లను వినియోగించుకోవాల్సి ఉంటుంది. 

Read Also పల్లా సింహాచలంను పరామర్శించిన బీవీ రామ్ 

ఈనేపథ్యంలో టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఓ మహిళా నేత ఎన్నికల ప్రచారంలో ఉండగా.. ఓ ఫోన్ కాల్ రావడంతో హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి అర్జెంట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. 

Read Also మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే.. టిడిపి పరిస్థితి ఏంటి?

20 -2

Read Also జగన్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు ఆపాలి?

టీడీపీ పార్టీ నుంచి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గం నుంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పోటీ చేస్తున్నారు. ఆమె ఒక గైనకాలజిస్ట్. వృత్తి రిత్యా డాక్టర్ అయినప్పటికీ రాజకీయాల్లో ఆమె చురుకుగా పాల్గొంటారు. ఎన్నో సామాజిక సేవలు చేస్తుంటారు. అందుకే.. ఆమెకు టీడీపీ అధినేత చంద్రబాబు..

దర్శి నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ను ఇచ్చారు. దీంతో ఆమె దర్శి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రోజంతా బిజీ షెడ్యూల్. ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండటం లేదు ఆమె. కానీ.. ఎంతో ముఖ్యమైన ఎన్నికల ప్రచారాన్ని సడెన్ గా వదిలేసి అర్జెంట్ గా ఆసుపత్రికి వెళ్లి ఓ ఆపరేషన్ చేశారు. 

TDP Candidate Gottipati Lakshmi : గర్భిణీకి ఆపరేషన్ చేసి నిండు బిడ్డ ప్రాణాలు కాపాడిన లక్ష్మి

తనకు దగ్గర్లోని ఓ ఆసుపత్రిలో ఓ గర్భిణీకి డెలివరీ అవ్వడం లేదని.. చాలా ఇబ్బందిగా ఉందని.. లేట్ అయితే కడుపులోని బిడ్డ, తల్లి ప్రాణాలకు ప్రమాదం అని తెలుసుకున్న లక్ష్మీ వెంటనే ఆ ఆసుపత్రికి వెళ్లి సిజేరియన్ ఆపరేషన్ చేసి తల్లి, బిడ్డ ఇద్దరినీ కాపాడారు. 

20 -3

తను చేసిన గొప్ప పనికి హేట్సాఫ్ అంటూ టీడీపీ పార్టీ అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఆ వీడియోను షేర్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తను చేసిన పనికి మెచ్చుకున్నారు. గుడ్ జాబ్ అంటూ కామెంట్ చేశారు. వైసీపీ నేతలు దళితులను చంపేసి, డోర్ డెలివరీ చేస్తున్నారు.

కానీ టీడీపీలో మాత్రం ప్రాణం పోస్తున్న నేతలు ఉన్నారు. దర్శి నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఉన్న టీడీపీ అభ్యర్థి డా.గొట్టిపాటి లక్ష్మి తన మానవత్వాన్ని చూపించారు. అత్యవసర పరిస్థితిలో ఉన్న ఓ గర్భిణీకి సిజేరియన్ ఆపరేషన్ చేసి తల్లీబిడ్డను కాపాడారు.. అని టీడీపీ సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు. 

ఆ వీడియోను చూసిన నెటిజన్లు కూడా తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ డాక్టర్ ను మెచ్చుకుంటున్నారు. డాక్టర్ అంటే కనిపించే దైవం అని, అత్యవసర సమయంలో తన ముఖ్యమైన పనులు కూడా వదిలేసి ఇద్దరు ప్రాణాలను కాపాడిన మీకు హేట్సాఫ్ అంటూ నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?