ఈనెల 28న తాడేపల్లి గూడెంలో టీడీపీ, జనసేన బహిరంగసభ

ఈనెల 28న తాడేపల్లి గూడెంలో టీడీపీ, జనసేన బహిరంగసభ

ఏలూరు :  సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయ వేడి మొద‌లైంది. అధికార వైసీపీ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగాతెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ప్రచారానికి సిద్ధమ్యాయి. కాగా ఈనెల‌ 28వ‌ తేదీన తాడేపల్లి గూడెంలో ఉమ్మడి బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేర‌కు విజయవాడలో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం అనంత‌రం ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఈ బ‌హిరంగ స‌భా వేదిక పైనుంచి ఉమ్మడి మేనిఫెస్టోతో పాటు సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశాల‌ను కూడా ప్రకటన చేసే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. డ్వాక్రా మహిళలకు ఉమ్మడి మేనిఫెస్టోలో రుణ‌మాఫీపై తాడేపల్లిగూడెం సభలో కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్టు సమాచారం. కోఆర్డినేష‌న్ క‌మిటీ స‌మావేశంలో ఉమ్మ‌డి కార్యాచరణ, మేనిఫెస్టో రూపకల్పన తదితర అంశాలపై క్షుణ్ణంగా చ‌ర్చించారు. టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్‌, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య, నిమ్మల రామానాయుడు త‌దిత‌రులు పాల్గొన్నారు. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌, బొమ్మిడి నాయకర్‌, పాలవలస యశస్విని, కొటికలపూడి గోవిందరావు త‌దిత‌రులు స‌మావేశంలో పాల్గొన్నారు. 

230

Read Also పల్లా సింహాచలంను పరామర్శించిన బీవీ రామ్ 

టీడీపీ - జనసేన కూటమి వలంటీర్ల వ్యవస్థ కట్టడిపై ప్రత్యేక దృష్టి సారించ‌నుంది. మంత్రి ధర్మాన చేసిన కీల‌క వ్యాఖ్య‌లు వలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా నియమిస్తామ‌న‌డాన్ని టీడీపీ - జనసేన కూట‌మి సీరియస్‌గా తీసుకుంది. ఈసీ ఆదేశాల‌కు విభిన్నంగా వలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా ఎలా నియ‌మిస్తార‌ని కూట‌మి స‌భ్యులు ప్ర‌శ్నించారు. మంత్రి ధర్మాన వ్యాఖ్యల ప‌ట్ల‌ ఈసీకి ఫిర్యాదు చేస్తామ‌ని స‌మ‌న్వ‌య క‌మిటీ స్ప‌ష్టం చేసింది. కాగా ఈ కమిటీ భేటీలో ఎన్నిక‌ల్లో పోటీ చేసే సీట్ల స‌ర్దుబాటు అంశం మాత్రం రాలేదు. పార్టీ అధినాయ‌కులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్ర‌మే సీట్ల అంశాన్ని చ‌ర్చించే అవ‌కాశం ఉంది. ఇప్ప‌టికే బీజేపీతో క‌లిసి పోటీచేయాల‌ని కూట‌మి నిర్ణ‌యం తీసుకుంది. ఈ నేప‌థ్యంలో పొత్తుల అంశం కొలిక్కి వచ్చిన తర్వాతనే సీట్ల అంశాల ప్రకట‌న వెలువ‌డే అవ‌కాశం ఉంది. తాడేపల్లిగూడెం బ‌హిరంగ స‌భ లోపే ఈ చ‌ర్చ‌లు పూర్త‌వుతాయ‌ని, స‌భ‌లోనే ప్రకటన ఉండవచ్చని అంచనాలు కొన‌సాగుతున్నాయి.  

Read Also మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే.. టిడిపి పరిస్థితి ఏంటి?

మ‌రోసారి అధికారం కోసం వైసీపీ ప్ర‌భుత్వం అరాచ‌కాల‌కైనా తెగించే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఇందుకోసం రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు జగన్‌ ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ  నేతలు మీడియాపై దాడులు చేస్తున్నార‌ని, ఈ దాడుల‌ను ఖండిస్తూ సమావేశంలో తీర్మానం చేశారు. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల‌ పరిపాలనలో వ్యవస్థలన్నీ నాశనం చేసిన‌ట్లు ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర పరువు తీశార‌ని, ప్రజలు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా బ‌హిర్గతం చేయ‌లేక‌పోతున్నార‌ని వెల్ల‌డించారు. రాబోయే ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్త‌మై జ‌గ‌న్‌కు బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చర్చించిన‌ట్లు తెలిపారు. ఓట్లు చీలకూడదని పవన్‌ కల్యాణ్‌ పలుమార్లు చెప్పారని, ఇందుకోస‌మే టీడీపీ, జ‌న‌సేన క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న‌ట్లు నాదెండ్ల మనోహర్ గుర్తు చేశారు. రెండు పార్టీల‌ కార్యకర్తలు జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు కృషి చేయాల‌ని విజ్ఞప్తి చేశారు.

Read Also జగన్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు ఆపాలి?

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?