YS sunitha : పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన వైయస్ సునీత...లక్ష్యం ఇదే...
ఈ క్రమంలోనే పులివెందుల నియోజకవర్గంలో వివేకానంద భార్య సౌభాగ్యమ్మ పోటీ చేస్తారంటూ ప్రచారాలు కూడా తెరపైకి రావడం జరిగింది. ఇలాంటి తరుణంలోనే వైయస్ వివేకానంద కూతురు సునీత రానున్న ఎన్నికల్లో పొలిటికల్ ఎంట్రీపై అలాగే తన లక్ష్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనవంతు భాగంగా జగన్ పార్టీకి గట్టి షాక్ ఇవ్వాలని వైయస్ షర్మిల మరియు సునీత చూస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా వీరిద్దరి లక్ష్యం అవినాష్ రెడ్డి అని వార్తలు తెరపైకి వస్తున్నాయి.ఎందుకంటే వైసీపీ పార్టీ అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం , షర్మిల సునీత తట్టుకోలేకపోతున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే తన చిన్నాన కోరిక మేరకు తాను కడప ఎంపీగా పోటీ చేస్తున్నట్లు వైయస్ షర్మిల ప్రకటించింది.
దీంతో వైయస్ షర్మిలకు తన పూర్తి మద్దతు కచ్చితంగా ఉంటుందని వైయస్ సునీత కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన సునీత తన రాజకీయ ఎంట్రీపై అలాగే రాజకీయ లక్ష్యంపై క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రావడం లేదని తెలియజేశారు. కానీ రానున్న ఎన్నికల్లో కడప జిల్లాలో అవినాష్ రెడ్డిని ఓడించడమే తన ముఖ్య లక్ష్యమని ఈ సందర్భంగా సునీత పేర్కొన్నారు.
అలా అని తన పోరాటం రాజకీయం కోసం కాదని న్యాయం కోసం మాత్రమే అంటూ సునీత చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో నా కుటుంబ సభ్యులే నా తండ్రిని చంపుతారని మొదట నేను నమ్మలేదు...ఇది నేను చేసిన పొరపాటే అంటూ సునీత వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ ఫర్ వివేక పేరుతో మీడియాతో ముచ్చటించిన సునీత..2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాల గురించి కూడా వివరించారు.
దీనిలో భాగంగానే 2014 ఎన్నికల్లో కడప జిల్లా నుండి షర్మిల పోటీ చేస్తారని అంతా భావించారని , కానీ ఆ స్థానాన్ని అవినాష్ రెడ్డికి కేటాయించారని అది వివేకానందకు ఏమాత్రం నచ్చలేదని తెలిపారు. అనంతరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకానంద ఓటమిపాలయ్యారని...ఇక ఆ ఓటమికి కారణం అవినాష్ కుటుంబం వెన్నుపోటు అని తర్వాత వెళ్లడైనట్లుగా తెలిపారు..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా వివేక కోలుకుని 2019 ఎన్నికలకు సిద్ధమయ్యారని సునీత వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే జగన్ పాదయాత్రలో వివేక కూడా అప్పుడప్పుడు వచ్చి కలిసే వారిని...ఇక ఈ కాలక్రమంలోనే పులివెందులలో వివేక ఓటు కూడా లేకుండా పోయిందంటూ సునీత తెలియజేశారు.
ఇది ఇలా ఉండగా తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వక పోయినప్పటికీ అవినాష్ రెడ్డి ని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నారని సునీత బహిరంగంగానే వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఈ న్యూస్ కడప రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.