కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా పోరాడండి
On
2014 లో గద్దెనెక్కిన మోడీ ప్రభుత్వం అదాని, అంబానీ లాంటి కార్పొరేట్లకు వారి సంపదను పెంచడమే తమ లక్ష్యంగా పెట్టుకుందనీ.. కార్మికుల శ్రమను కారుచౌకగా కొల్లగొట్టుకునేందుకు ఆటంకంగా ఉన్న కార్మిక చట్టాలను కాలరాసేందుకు నాలుగు లేబర్ కోడ్లను రూపొందించి అక్రమంగా వాటి అమలకు పూనుకుంటుందనీ.. ప్రముఖ ప్రజాతంత్ర ఉద్యమకారుడు... కార్మిక వర్గ బోరపుత్రుడు... శ్రామిక వర్గ రాజ్యాధికార స్వప్నికుడు... కమ్యూనిస్టు విప్లవ నాయకుడు కామ్రేడ్ జెకెఆర్ గారి జె ఎస్ ఆర్ సోమవారం పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. గత పది సంవత్సరాల బిజెపి- ఎన్.డి.ఏ పాలనలో అది రూపొందించిన వ్యవసాయ, కార్మిక విధానాలు అతికొద్దిమందిని కుబేరులుగా చేసి అశేష ప్రజానికాన్ని పేదరికం వైపు నెడుతున్నాయన్నారు. ధరలు చుక్కలనంటుతున్నాయి. రికార్డు స్థాయిలో నిరుద్యోగం పెరిగిపోవడమేగాక రోజు రోజుకు ఉద్యోగ భద్రత కరువైపోతుంది. దేశ ఆర్థిక పరిస్థితి కునారిల్లిపోతుంది. ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తున్నా తీవ్ర సమస్యలను పట్టించుకోకుండా మోడీ 3.0 పాలన అన్నదాతలైన రైతులను, సంపద సృష్టికర్తలైన శ్రామిక జనావళిని అణగదొక్కే దుర్మార్గ పూరిత చట్టాల అమలకు తెరలేపుతుందనీ అన్నారు.

దేశంలో 1991లో ప్రారంభించిన సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలకై పాలకులు అవలంబించిన కార్మికవర్గ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఇప్పటివరకు సుమారు 19 దేశవ్యాప్త సమ్మెలు జరిగాయనీ... నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మూడు సార్వత్రిక సమ్మెలు జరిగాయని.. అయినా బి.జె.పి బాహాటంగా కార్పొరేట్లను భుజాలకెక్కించుకొని లేబర్ కోడ్ల రూపంలో దేశ కార్మిక వర్గంపై దాడిని తీవ్రతరం చేసిందనీ అన్నారు. 2019 వేతనాల కోడ్ వల్ల జాతీయ కనీస వేతనం పేరుతో రాష్ట్రాలు వేతనాలు నిర్ణయించే అధికారం కోల్పోతాయి. వేతనాలు తగ్గిపోయే ప్రమాదం ఎక్కువవుతుంది. కనీస వేతనాల అమలయ్యే అవకాశం లేకుండా పోతుంది. ఓవర్ టైమ్, సమాన వేతనం పొందే హక్కు కోల్పోయే అవకాశం ఉంటుందనీ పేర్కొన్నారు.
Tags:
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...