CM Revanth Reddy : పేద‌ల ఆత్మ‌గౌర‌వం ఇందిర‌మ్మ ఇండ్లు 

భ‌ద్రాచ‌లంలో ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కం ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : పేద‌ల ఆత్మ‌గౌర‌వం ఇందిర‌మ్మ ఇండ్లు 

CM Revanth Reddy : భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, క్విక్ టుడే : బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలు, పేద ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వం ఇందిర‌మ్మ ఇండ్లు అని తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమ‌వారం ఆయ‌న భ‌ద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రూ.22,500 కోట్ల‌తో ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కం  కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారు. ఈ కార్య‌క్రమంలో డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావు, సీత‌క్క‌, కొండా సురేఖ‌, కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, శ్రీధ‌ర్ బాబు, పొన్నం ప్ర‌భాక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ.. ఇందిర‌మ్మ ఇండ్ల‌ను మ‌హిళ‌ల పేరుతో ఇస్తున్నామ‌ని, వారి క‌ళ్ల‌ల్లో ఆనందం చూడాల‌నేదే ప్ర‌భుత్వ ల‌క్ష్య‌మ‌న్నారు. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్న‌ర ల‌క్ష‌ల ఇండ్లు ఈ ప‌థ‌కం ద్వారా మంజూరు చేశామ‌ని తెలిపారు.

112

Read Also కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా పోరాడండి

ఇందిర‌మ్మ ఇండ్ల ద్వారా పేద‌ల‌కు న్యాయం జ‌రుగుతుందని అర్హులైన ప్ర‌తి ఒక్క పేద కుటుంబానికి ఇండ్లు నిర్మించి ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. డ‌బుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో కేసీఆర్ తెలంగాణ ప్ర‌జ‌ల‌ను మోసం చేశార‌ని అన్నారు. నిజంగా ఆయ‌న డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చిన ఊళ్ల‌ల్లో ఓట్లు అడుగాల‌ని, మేం ఏ ఊళ్ల‌ల్లో అయితే ఇందిర‌మ్మ ఇండ్లు ఇచ్చామో అక్క‌డ మేము ఓట్లు అడుగుతామ‌ని మాజీ సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి ఈ సంద‌ర్భంగా స‌వాల్ విసిరారు. పార్టీతో సంబంధం లేకుండా అర్హులంద‌రికీ మా ప్ర‌భుత్వం ఇందిర‌మ్మ ఇండ్లను క‌ట్టిస్తుంద‌ని అన్నారు. క‌ట్టు క‌థ‌ల‌తో తెలంగాణ ప్ర‌జ‌ల‌ను కేసీఆర్ మోసం చేశార‌ని, అందుకే ఆయ‌న ప్ర‌భుత్వాన్ని తెలంగాణ ప్ర‌జ‌లు బొంద‌పెట్టార‌ని ఎద్దేవా చేశారు. ఖ‌మ్మం జిల్లాలో ఎప్ప‌టి నుంచో కాంగ్రెస్ కు అనుబంధం ఉంద‌ని అన్నారు.

Read Also దేశం లో గర్వింగా భావించే ఇందిరా సౌర గిరిజన వికాస పథకం

అందుకే 2014, 2016, 2003 ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఒక్క స్థానంతో స‌రిపెట్టుకున్నార‌ని గుర్తు చేశారు. కేసీఆర్ మోస‌పు మాట‌ల‌ను ఖ‌మ్మం ప్ర‌జ‌లు న‌మ్మ‌లేద‌ని వివ‌రించారు. డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ భ‌ద్రాద్రి రాముడిని కూడా కేసీఆర్ మోసం చేశార‌ని మండిప‌డ్డారు. భ‌ద్రాద్రి శ్రీరాముడి ఆల‌య అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తాన‌ని ఒక్క రూపాయి కూడా ఇవ్వ‌లేద‌ని గుర్తు చేశారు. అంత‌కు ముందు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  భ‌ద్రాచలంలోని శ్రీ సీతారామ‌చంద్ర‌స్వామిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు. 

Read Also వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా స్వామి వారి ఇరవై వార్షికోత్సవం కార్యక్రమాలు

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?