Peerzadiguda : సమీకృత వ్యర్థ పదార్ధాల శుద్ధీకరణ పార్క్ ను సందర్శించిన కలెక్టర్ గౌతమ్
On
Peerzadiguda : పీర్జాదిగూడ, క్విక్ టుడే : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సమీకృత వ్యర్థ పదార్ధాల శుద్ధీకరణ పార్క్ ను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్, మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కమిషనర్ ఇస్లావత్ నమ్య కలిసి సందర్శించారు.
ఈ సందర్బంగా మేయర్ నగర పరిధిలో తడి, పొడి, హానికారక చెత్తను ఇండ్ల వద్దనే వేరు చేసి సేకరించడంతో పాటు సేకరించిన చెత్తను తడి చెత్త నుండి సేంద్రీయ ఎరువును, పొడి చెత్త ను రీసైక్లింగ్ ద్వారా పునర్వినియోగించే విదానాన్ని కలెక్టర్ కు వివరించారు.
Read Also పరవాడలో అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు
ఇక్కడ ఏర్పాటు చేసిన బ్రికెట్, స్క్వీజింగ్ మిషన్ల విధానం ఇతర మున్సిపాలిటీలు కూడా ఆనుసరించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్వో హసీన, మేనేజర్ జ్యోతి, ఏఈ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Latest News
13 May 2025 13:09:44
క్విక్ టుడే, న్యూస్ :- ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...