గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయాలి

నియోజకవర్గ అభివృద్దే ధ్యేయంగా అంకితభావంతో పనిచేస్తున్నామని, ప్రతి మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్నామని తెలిపారు.తొర్రూరులో సబ్ రిజిస్టార్ కార్యాలయం తెస్తానని, గతంలో మంత్రిగా ఉన్న సమయంలో దయాకర్ రావు కనీసం సబ్ రిజిస్టర్ కార్యాలయం తేలేకపోయారని విమర్శించారు. పట్టణంలో మినీ ట్యాంకుబండ్, ఆడిటోరియం పనులు కొనసాగుతున్నాయని,వంద పడకల ఆసుపత్రి పనులు త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. అభివృద్ధి విషయంలో రాజీ పడబోనని స్పష్టం చేశారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇండ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. పేదలకు సన్న అన్నంతో కడుపు నింపుతున్నామని, పేదల కష్టం తెలిసిన ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు.రాజీవ్ యువ వికాసం పథకంతో యువతను బలోపేతం చేస్తున్నమన్నారు.ఆడవాళ్ళమని చులకనగా మాట్లాడుతున్నారని, తాము ఆడ పులులమని... తమ సహనాన్ని పరీక్షిస్తే అగ్ని గుండాల్లా మారతామని తెలిపారు.
ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ...
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోవర్టు రాజకీయాలకు తెరతీసాడని,కొందరు కోవర్ట్ లను పెట్టి కాంగ్రెస్ పార్టీని బలహీన పరచడానికి చూస్తున్నాడని,కోవర్టు రాజకీయాలు చేసేవారిని పార్టీ నుంచి తొలగిస్తామన్నారు.అత్తా కోడలు అభివృద్ధి కోసం పనిచేస్తుంటే ఓర్వలేని వారు తమ మధ్య తగాదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.వారి ఆటలు ఇక్కడ సాగవు అన్నారు. ఎర్రబెల్లి పాలకుర్తికి చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు.రానున్న ఎన్నికల్లో ఆయనను పర్వతగిరికే పరిమితం చేస్తామన్నారు.ప్రజా ప్రభుత్వం మహిళల కోసం అనేక పథకాలు తీసుకువచ్చిందని,రానున్న ఎన్నికల్లో మహిళలు ఈ ప్రభుత్వాన్ని ముందుండి నడిపించాలన్నారు.జిల్లా పరిశీలకురాలు రవళి రెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో మహిళలు ముందుండాలని, కెసిఆర్ పాలనలో మహిళలకు గౌరవం ఉండేది కాదని,ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఉందన్నారు. పాలకుర్తిలో ఎన్నడు కాంగ్రెస్ పార్టీ గెలవలేదని,ఝాన్సీ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ జెండా ఎగిరిందన్నారు.బడుగు బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు.కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి ఒక్కరికి స్థానం దక్కుతుందన్నారు. పదవుల విషయంలో అధిష్టానమే నిర్ణయం తీసుకుంటుందని ఎవరు అధైర్యపడవద్దన్నారు.ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా నాయక్, మండల అధ్యక్షుడు సుంచు సంతోష్,పట్టణ అధ్యక్షుడు సోమ రాజశేఖర్,నాయకులు జాటోత్ నెహ్రు నాయక్, కిషోర్ రెడ్డి, డాక్టర్ పోనుగోటి సోమేశ్వరరావు, ఎర్రబెల్లి రాఘవరావు,గంజి విజయపాల్ రెడ్డి,పెదగాని సోమయ్య,చాపల బాపురెడ్డి, చిత్తలూరి శ్రీనివాస్, మేకల కుమార్ అశోక్ రెడ్డి,వెంకట నారాయణ గౌడ్, రామచంద్రయ్య,సురేందర్ రెడ్డి,నర్సయ్య,శ్యాంసుందర్ రెడ్డి,రాజేష్ నాయక్,పింగిల్ ఉష, ప్రశాంతి, మల్లేశం గౌడ్, చెవిటి సధాకర్, శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ యాదవ్, లక్ష్మణ్, అభిరామ్ తదితరులు పాల్గొన్నారు.