Jr NTR Politics: రాజకీయాలపై స్పందించిన జూనియర్ ఎన్టీఆర్...ఇంతకూ ఏమన్నాడో తెలుసా..?
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన 30 వ సినిమా దేవర తో ముందుకు వచ్చాడు. దాదాపుగా తన సినీ ఇండస్ట్రీలో నేటికీ 30 సినిమాలు చేశాడు. అయితే ఈ సినిమాలన్నింటిలోనూ కూడా అతని పాత్ర అనేది చాలానే ఉంది. ఎన్నో బ్లాక్బస్టర్లు అందుకున్నాడు. అలాగే ఎంతో మంది ప్రేక్షకులను కూడా తన నటనతో మూట కట్టుకున్నాడు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయం గురించి 2009 ఆ కాలంలో ఎన్నో రకాలుగా రోడ్ షోలు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున చేశాడు. ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకుందాం.
అయితే ప్రస్తుతం దేవుర సక్సెస్ మీట్ లో రాజకీయం గురించి కొన్ని షాపింగ్ కామెంట్స్ చేస్తూ మళ్లీ రాజకీయపరంగా ప్రస్తావన తీసుకు వచ్చాడు. అయితే నాకు నటనే ముఖ్య ప్రాధాన్యత అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. ఓట్ల విషయం పక్కన పెడితే కొన్ని లక్షల మంది నా సినిమాను రావాలని కోరుకుంటున్నారు. నాకు కూడా చిన్నప్పటినుంచి నటన అంటే చాలా ఇష్టం. అందుకే ఇప్పుడు కూడా నటన మీదే దృష్టి పెడతాను. రాజకీయం నేను చేయలేను చేయను కూడా అని చెప్పాడు. రాజకీయమనేది పూర్తిగా పక్కన పెట్టేసి సినిమాల మీద దృష్టి పెడతానని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు. దాంతో ఇక భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఎన్టీఆర్ రాజకీయపరంగా చూసేటటువంటి అవకాశాలు ఇంక ఎప్పటికీ లేవు.
అయితే 2009 నాటి కాలంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారాలు కూడా చేసిన విషయం మనందరికీ తెలిసినదే. ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రమాదంలో గాయపడడం అలాగే తిరిగి కోలుకున్న తర్వాత ఇక రాజకీయాలను వదిలేసి సినిమా మీ దృష్టి పెట్టడంతో ఇక అప్పుడే అందరికీ అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఇక భవిష్యత్తులో కూడా ఎన్టీఆర్ రాజకీయాల జోలి వెల్లడని అందరూ అనుకుంటున్నారు. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం రాజకీయపరంగా భవిష్యత్తును మొదలుపెడితే ఒక రాజు లాగా చూడాలని కోరుకుంటున్నామని ఫ్యాన్స్ విపరీతంగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే నిన్న ఎన్టీఆర్ మాటలు విన్నాక ఫ్యాన్స్ అందరిలోనూ ఆందోళన కలుగుతుంది. ఇక ఎప్పుడూ కూడా రాజకీయపరంగా ఎన్టీఆర్ కనపడడని ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు.
ప్రస్తుతం రాజకీయంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ కూడా సినిమాలను వదిలేసి భారీ స్థాయిలో రాజకీయపరంగా ఉంటూ 2024వ సంవత్సరంలో జనసేన పార్టీ తరఫున కూటమిలో భాగమై పోటీచేసి ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని పొంది ఇప్పుడు రాజకీయపరంగా ప్రజలకు సేవలు అందిస్తున్నాడు. ఇలాగే పవన్ కళ్యాణ్ స్థానంలో ఎన్టీఆర్ ను కూడా చూడాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ కోరుకుంటున్నారు. అయితే ఇది ఇప్పట్లో జరిగే ఎటువంటి అవకాశం లేదు. మరి భవిష్యత్తులో అయినా ఇటువంటి పరిణామాలు జరుగుతాయో లేదో వేచి చూడాల్సిందే.
ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సక్సెస్ మీట్ లలో పాల్గొంటూ సినిమా యొక్క ప్రాధాన్యతను చూపుతున్నాడు. దాదాపుగా ఐదేళ్ల తర్వాత వచ్చినటువంటి ఎన్టీఆర్ సినిమా కావడంతో ప్రేక్షకులందరూ కూడా థియేటర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. మరి ఇప్పటికే ఈ సినిమా 300 కోట్ల కలెక్షన్ గ్రాస్ ని రాబడుతూ యావరేజ్ టాక్ తో ముందుకు దూసుకెళ్తూ ఉంది.
అలాగే ఈ సినిమాపై కొరటాల శివ పై చాలా మంది ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఎందుకంటే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో దియేటర్ కి వచ్చిన ఫ్యాన్స్ ఫస్టాఫ్ మంచి ఎలివేషన్స్ తో బాగానే ఫ్యాన్స్ కి ఊపు తెప్పించాడు. అంతే ఓహో సెకండాఫ్ చూడ్డానికి ఇంటర్వెల్లో నుంచి థియేటర్లో అడుగుపెట్టిన ఫ్యాన్స్ కి కొంచెం ఆందోళన కలిగించాడు కొరటాల శివ. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ అంత ఎలివేషన్ అనేవి సెకండాఫ్ లో లేవు. కాబట్టి ఎన్నో ఎక్సపెటేషన్తో థియేటర్కు వచ్చిన సరే కొరటాల శివ కొంచెం ఆందోళన కలిగించాడు.
అయినా సరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊపికి థియేటర్లు అదిరిపోతున్నాయి. ఏకంగా ఐదు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సినిమా రావడంతో థియేటర్లన్నీ ఫాన్స్ అలాగే ప్రజలతో నిండిపోతున్నాయి. మరి ఈ సినిమాకి మొత్తం మీద ఎంత వసూలు వస్తాయో అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి 300 కోట్లు గ్రాస్ ను ఈ దేవర మూవీ అందుకుంది. బడ్జెట్ కూడా 300 కోట్లు కావడంతో సినిమా బడ్జెట్ తో సమానంగా వసూలు అనేవి వచ్చాయి. మరి ఈ సినిమా ఎన్ని కోట్లను రాబడుతుందో వేచి ఉండాల్సిందే.
ముందు ముందు దసరా పండుగ సందర్భంగా కలెక్షన్లు కూడా భారీగానే వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పండుగ సందర్భంగా థియేటర్లకు వచ్చి చాలామంది ఈ సినిమాని చూసేటువంటి అవకాశం ఉంది. దీంతో ఈజీగా 700 కోట్లు కలెక్షన్లు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది.