Nalgonda : ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలి
మోడీ దిష్టిబొమ్మ దగ్ధం
Nalgonda : నల్లగొండ.ఫిబ్రవరి 16. (క్విక్ టుడే)
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి 200 రోజుల పని దినాలు రోజు కూలి 600 కు పెంచాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల జిల్లా కన్వీనర్ దండంపల్లి సరోజ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
శుక్రవారం నల్గొండ మండలం జి చెన్నారంలో కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మికుల సమ్మె గ్రామీణ భారత్ బంద్ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం దగ్గర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసారు.
. ఈ సందర్భంగా సరోజ మాట్లాడుతూ ప్రభుత్వ ధనాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పుతూ కార్మిక చట్టాలను మార్పు చేస్తూ ప్రజలను బానిసలుగా మారుస్తున్నారని ఆరోపించారు నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో మహిళలకు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారని ఆరోపించారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచాలని రైతాంగానికి కనీస మద్దతు ధర చట్టం పార్లమెంట్లో ఆమోదించాలని సమాన పనికి సమాన వేతనం అమలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు కట్ట అంజయ్య గ్రామపంచాయతీ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు సిఐటియు వివిధ రంగాల కార్మికులు జిల్లపల్లి మంగా బొల్లం సత్తయ్య సైదులు ఉప్పునూతల శ్రీను, శైలజ, శ్రీశైలం, మారగోని అంజయ్య, మేడగోని మారయ్య లింగమ్మ, వెంకటమ్మా, తదితరులు పాల్గొన్నారు