MLC Kavita arrested : ఎమ్మెల్సీ క‌విత మ‌రో సారి అరెస్ట్‌..!

MLC Kavita arrested : ఎమ్మెల్సీ క‌విత మ‌రో సారి అరెస్ట్‌..!

MLC Kavita arrested : ఢిల్లీ లిక్కర్ స్కామ్, మ‌నీలాండ‌రింగ్‌ కేసు లో మార్చి 15న కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుండి ఈ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి ఈ కేసు పై కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

అయితే ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యూడిషియల్ కష్టడీ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈ రోజు సీబీఐ అధికారులు అరెస్టు చేయడం జరిగింది. ఇప్పటివరకు కవిత ఈడీ కస్టడీలో ఉండగా ఇక‌ ఆమెను సీబీఐ క‌స్ట‌డీలో ఉండ‌నుంది. 

Read Also లైసెన్స్ డ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

114 -2

Read Also ఆర్టీసీ బస్టాండ్ లో సరైన వసతులు లేక ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు

పూర్తి వివరాల్లోకి వెళితే...
లిక్కర్ స్కామ్ కేసులో ఇదివరకే అరెస్టు అయి తీహార్ జైల్లో ఉన్న కవితను నేడు సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు కవితను సీబీఐ ప్ర‌త్యేక కోర్టు అనుమ‌తితో ఈ నెల 6న‌  తీహార్ జైల్లోనే విచారణ జరిపారు. గ‌తంలోనూ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు హైద‌రాబాద్‌లోనూ ఆమెను విచారించారు.

Read Also రెండు  కంచు గంటలు అందజేత

కాగా ఈరోజు ఆమెను అరెస్టు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే లిక్కర్ స్కామ్, మ‌నీలాండ‌రింగ్‌ కేసులో కేజ్రీవాల్ తో కలిసి కవిత కుట్రలు చేసినట్లుగా సీబీఐ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే కవితను అరెస్టు చేస్తున్నట్లుగా ఈరోజు (గురువారం) ప్రకటన ద్వారా అధికారులు తెలియజేశారు.

Read Also విద్యుత్ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

దీంతో ప్రస్తుతం తీహార్ జైల్లో జ్యూడిషల్ కస్టడీ లో ఉన్న కవితను సీబీఐ అధికారులు హెడ్ క్వార్టర్స్ కు తరలించనున్నారు. నేడు కోర్టుకు సెల‌వు ఉన్నందును రేపు (శుక్రవారం) కోర్టులో ఆమెను ప్రవేశపెట్టి కస్టడీకి తీసుకోనున్నట్లు సమాచారం.

Read Also ప్రజావాణి అర్జీలు వెంటనే పరిష్కరించాలి

114 -3

ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితను విచార‌ణ చేప‌ట్టాల‌ని గ‌తంలోనే సీబీఐ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు కవిత‌ బెయిల్ విషయంపై ఈ నెల 16వ తేదీన పిటిషన్ విచార‌ణకు రాబోతున్నట్టు సమాచారం. ఇలాంటి తరుణంలో కవితను మళ్ళీ సీబీఐ అధికారులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది. 

అయితే ఎలాంటి ముంద‌స్తు నోటీసులు ఇవ్వ‌కుండా సీబీఐ అధికారులు అరెస్టు చేయ‌డాన్ని స‌వాల్ చేస్తూ ఎమ్మెల్సీ క‌విత త‌ర‌ఫున న్యాయ‌వాది మోహిత్‌ రావు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. తిహార్ జైల్లో జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీలో ఉండ‌గానే  క‌నీసం నోటీసులు కూడా ఇవ్వ‌కుండా ఎలా అరెస్టు చేస్తార‌ని పేర్కొన్నారు. త‌క్ష‌ణ‌మే ఈ పిటిష‌న్‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని ఆయ‌న కోర్టును కోరారు.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?