MLC kavitha : క‌విత బెయిల్ పై కాసేప‌ట్లో విచారణ....సర్వత్ర ఉత్కంఠ...

MLC kavitha : క‌విత బెయిల్ పై కాసేప‌ట్లో విచారణ....సర్వత్ర ఉత్కంఠ...

MLC kavitha : తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత అరెస్ట అయి జైలుకు వెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కవితకు జ్యూడిషల్ రిమాండ్ విధించడం జరిగింది. దీంతో ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు.ఇది ఇలా ఉండగా ఈ కేసు విషయంలో ఆమె దాఖలు చేసిన అభ్యంతర బెయిల్ పిటిషన్ పై నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది.

ఇక ఈ పిటిషన్ లో తన చిన్న కొడుకుకి ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నందున ఈ సమయంలో తన అవసరం తన కుమారుడికి ఉందని అందుకే ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. అలాగే సాధారణ బెయిల్ పిటిషన్ పై కూడా విచారణ జరపాలని న్యాయస్థానాన్ని కోరారు.

Read Also రైతులకు అండగా జిల్లా యంత్రాంగం

013 -2

Read Also వ‌ర్షాకాలంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి..అధికారులు, క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి

అయితే ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసు విచారణలో ఉండడం వలన కవితకు బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ఆమె ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని అందుకే బెయిల్ ఇవ్వద్దంటూ ఈడి అధికారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇక ఇరుపక్ష వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1 వాదనలు వినిపించాల్సిందిగా కోరుతూ ఏప్రిల్ 1కి కేసును వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో ఈ కేసు పై విచారణలు జరగనున్నాయి.

Read Also మద్దిమడుగు అంజన్న సన్నిధిలో సినీ హీరో అర్జున్ 

ఇది ఇలా ఉండగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న కవితను ఈడి అధికారులు హైదరాబాదులోని తన నివాసంలో అరెస్టు చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన అనంతరం ఆమెను ఢిల్లీకి తీసుకువచ్చి మార్చి 16న ఢిల్లీ లోని రౌస్  అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలోనే 10 రోజులు కస్టడీకి ఈడి అధికారులు కోరగా న్యాయస్థానం 7 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.

Read Also సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు

అనంతరం మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఈడీ అధికారులు కోరగా న్యాయస్థానం 3 రోజులకు అనుమతించింది . ఇక చివరిగా కవితను మార్చి 26న ఈడీ అధికారులు అవెన్యూ కోర్టులో హాజరుపరచారు. దీంతో ఏప్రిల్ 9వ తేదీ నుండి 14 రోజులు పాటు కవితకు జ్యూడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది.

Read Also యూత్ లీడర్స్ విద్యార్థులు ప్రధానోపాధ్యాయులు శ్రేయోభిలాషులతో ఎంఈఓ సమావేశం

013 -1
ఇక ఈ జ్యూడిషియల్ రిమాండ్ లో భాగంగా కొన్ని ప్రత్యేకమైన వసతులు కవితకు కల్పించాల్సిందిగా న్యాయస్థానంకు  విజ్ఞప్తి చేశారు. ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడం , బట్టలు ,అభరణాలు ధరించడం సొంతంగా పరుపులు ఏర్పాటు చేసుకోవడం , దుప్పట్లు మరియు చెప్పులు ధరించడం వంటి వెసులుబాట్లను ఇవ్వాల్సిందిగా కవిత తరపున లాయర్లు కోరగా దానికి కోర్టు అనుమతించింది.

కానీ కవిత జైల్లోకి వెళ్లిన తర్వాత జైలు అధికారులు మాత్రం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అనుమతించలేదని కవిత తరపున న్యాయవాది ఈనెల 28న మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి తెలియజేశారు. ఇక ఈరోజు విచారణ సందర్భంగా కవిత తరపున న్యాయవాదులు ఈ అంశాన్ని మరోసారి కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి .

ఇక ఈరోజు జరిగే విచారణలో మభ్యంతర బెయిల్ మంజూరు కానట్లయితే జైల్లో వసతులైన కల్పించే విధంగా జైలు అధికారులకు ఆదేశించాలని కోర్టును కవిత తరపున న్యాయవాదులు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?