ప్రతిభా పురస్కారం అందుకున్న కవి నాల్లం శ్రీనివాస్

ప్రతిభా పురస్కారం అందుకున్న కవి నాల్లం శ్రీనివాస్

తొర్రూర్  మే 15(క్విక్ టుడే న్యూస్):- అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక సాహిత్య సంబరాలు ప్రోగ్రాం కన్వీనర్  జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి. పార్థసారథి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ కళావేదిక జాతీయ  కన్వీనర్ కొల్లి రమావతి అధ్యక్షతన ఏలూరులోని మహాలక్ష్మి గోపాల స్వామి కళ్యాణ మండపంలో 48 గంటల పాటు రెండు రోజులుగా  ఘనంగా జరిగాయి. IMG-20250515-WA0046ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా ఏపిఎన్ఆర్జీ మాజీ డైరెక్టర్ చప్పడి రాజశేఖర్, ముఖ్య అతిథులుగా  మాస్ట్రో గజల్ శ్రీనివాస్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సపల్లి హారిక, శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్  లు హాజరై తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

గిరిజన సంప్రదాయ నృత్యాలతో, కొమ్ము డాన్స్ లతో సంబరాలు మొదలై ఆద్యంతం ఘనంగా  రెండు రోజులపాటు జరిగాయి. సుదూర ప్రాంతాల  నుండి వచ్చిన కవులు, కళాకారులు 2 వేల మంది హాజరై కవిత గానం, భరతనాట్యం, కూచిపూడి, పుస్తకావిష్కరణ, నాటికలు, ఏకపాత్రాభినయం తదితర కార్యక్రమాలు అక్కడికి విచ్చేసిన ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం ముఖ్యఅతిథి మాస్ట్రో గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంత బృహత్తరమైన కార్యక్రమాలు చేస్తున్న ప్రతాప్ సాహిత్య సేవలు అనితర సాధ్యమైనవని, ప్రపంచంలో నెంబర్ వన్ సంస్థగా  శ్రీ శ్రీ కళా వేదిక నిలుస్తుందని అన్నారు. తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా సంబరాలు ఉన్నాయని, ఇది ప్రపంచంలో ఒక ప్రతాప్ కే సాధ్యమని కొనియాడారు. మరొక ముఖ్య అతిథి  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సపల్లి హారిక మాట్లాడుతూ నిరంతర సాహితీయోధుడుగా  ప్రతాప్ చరిత్రలో నిలుస్తారని అన్నారు. కవులు, కళాకారులు ఒకే వేదికపై ప్రదర్శనలు చేయడం రికార్డుగా పేర్కొన్నారు. అంతేకాకుండా ఇటువంటి బృహత్తర కార్యక్రమాల వల్ల తెలుగు భాష పరిఢ విల్లుతుందని అన్నారు. విశిష్టఅతిధి ఏపిఎన్ఆర్జీ మాజీ డైరెక్టర్ చప్పిడి రాజశేఖర్, టిడిపి 
మీడియా ప్రతినిధి బోళ్ల సతీష్ బాబు  లు మాట్లాడుతూ ఇటువంటి రికార్డు కార్యక్రమాలు చేయడం శ్రీ శ్రీ కళావేదిక కే సాధ్యమని అన్నారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ కళావేదిక సీఈవో
డాక్టర్ ప్రతాప్ చేస్తున్న సాహిత్య సేవలను వారు కొనియాడారు. అనంతరం ప్రతినిధులు ఈ బృహత్తర కార్యక్రమం నాలుగు వరల్డ్ రికార్డుల్లో నమోదైనట్లుగా సభాస్థలిపై ఆహుతుల సమక్షంలో  ప్రకటించారు. అనంతరం శ్రీ శ్రీ కళా వేదిక  అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ ప్రపంచ సాహిత్య సాంస్కృతిక చరిత్రలో ఏ భాషలో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగలేదని, ఇలా ఏకధాటిగా ఏ సాహిత్య చరిత్రలో,ఏ సాహిత్య సంస్థలో,ఏ ప్రభుత్వాలు చేయలేనటువంటి కార్యక్రమాలు మీ అందరి సహకారంతో,మా జాతీయ కమిటీ సహకారంతో మీ సహకారంతో చేస్తున్నామన్నారు. ప్రతిభ మీదయితే ప్రోత్సాహం మాది అనేటువంటి కాన్సెప్ట్ తో మట్టిలో మాణిక్యాలను కూడా వెలికి తీయాలనే ఉద్దేశంతో ఈ కవి
సమ్మేళనాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కవి సమ్మేళనాలు మీద కూడా సీనియర్ రచయితలు కామెంట్ చేస్తుంటారు. వాళ్లు కవులా..!వాళ్లు రాసింది రాతలా..!ప్రతివాడు కవులె లా అవుతారని అంటున్న విమర్శకు స్పందిస్తూ వారు  ఎస్ నా దృష్టిలో కవిత్వం పై అక్షరాలు పెట్టిన ప్రతి ఒక్కరూ కవే మీరు ప్రోత్సహించాలి, వారిని తయారు చేయాల్సిన బాధ్యతను మీరు విస్మరించడమేనా..? వారిని ఎప్పుడూ కించపరచ పరచడమేనా మీ పని అని ఆవేదన వ్యక్తం చేశారు.అప్పుడు మీరేనా..?ఇప్పుడు మీరేనా..?ఎప్పుడు మీరేనా..?ఇంకా కొత్త మొక్కని, కొత్త మొగ్గని ఎదగనివ్వరా..?అది శ్రీశ్రీ కళావేదిక ద్వారా మేము సాధించి తీరుతామని మట్టిలో మాణిక్యాలను కవులుగా,ప్రోత్సహించి కవుల స్థాయి నుండి ముఖ్య అతిథుల స్థాయికి తీసుకువెళ్లేందుకు వారి ప్రతిభా సామర్ధ్యాలను గుర్తిస్తూ వారిని ప్రోత్సహిస్తూ,తెలుగు భాషను 
తెలుగు సాహిత్యాన్ని, తెలుగు సంస్కృతిని ఖండాంతరాలకు వ్యాపింపజేయాలనే ఉద్దేశంతో ఈ సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవాన్ని
పురస్కరించుకొని మాతృదేవోభవ పురస్కారాలను అమ్మకు వందనం పేరిట ఉభయ రాష్ట్రాలకు చెందిన 50 మందికి అందజేశారు. అంతే కాకుండా పలువురు సాహితీ వెత్తలకు,కవులకు అక్షర తేజం, కవిరత్న, ప్రతిభ పురస్కారాలను అందజేశారు.తెలుగు భాష సేవమూర్తులను సత్కరించారు. చిన్నారుల నృత్యాలతో,మ్యూజిక్ పాటలతో, నెమలి పించం నాట్యాలతో కోలాటాలతో సంబరాలు అంబరాన్ని తాకాయి. ఆదివారం అట్టహాసంగా జరిగిన ముగింపు కార్యక్రమంలో కవి సమ్మేళనాలు, పుస్తకావిష్కరణ సదస్సులు, నాటికలు, ఏకపాత్రాభినయాలు, మ్యూజిక్, కూచిపూడి, భరతనాట్యం  తదితర ప్రదర్శనలతో వివిధ ప్రాంతాల నుండి  విచ్చేసిన కవులు కళాకారులు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నారు.ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా  తొర్రూర్ మండలం ఖానాపురం గ్రామానికి చెందిన కవి మహానగరంలో న్యూస్ రిపోర్టర్ నాల్లం శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని తమ కవిత గానాన్ని వినిపించి సకల చరాచర సృష్టిలోని అమ్మను మించిన దైవం లేదని అమ్మ గొప్పతనాన్ని చాటి చెప్పినందుకు శ్రీ శ్రీ కళా వేదిక నిర్వాహకులు శ్రీ శ్రీ కళా వేదిక   అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్, ముఖ్య అతిథులు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సపల్లి హారిక లు ప్రతిభా పురస్కారంతోపాటు ప్రశంసా పత్రం  మెమొంటోను అందించి నాల్లం శ్రీనివాస్ ను సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుత.. కవుల నుండి ఏనాడు కూడా  ఒక్క రూపాయి  ఆశించకుండా కవులను ప్రోత్సహిస్తూ ఇలాంటి బృహత్తర కార్యక్రమాలు చేపట్టడం శ్రీ శ్రీ కళావేదికకే సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో నాకి అవకాశం ఇచ్చి  నన్ను ప్రోత్సహించి నా ప్రతిభను గుర్తించి నాకు ఈ పురస్కారం అందించిన  శ్రీ శ్రీ కళా వేదిక నిర్వాహకులకు  ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నామని తెలిపారు..

Read Also సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?