Southwest Monsoon : ముందుగానే నైరుతి రుతుప‌వ‌నాలు.. తొలుత ఎక్క‌డ ప్ర‌వేశిస్తాయంటే..

Southwest Monsoon :  ముందుగానే నైరుతి రుతుప‌వ‌నాలు.. తొలుత ఎక్క‌డ ప్ర‌వేశిస్తాయంటే..

Southwest Monsoon :  చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ఈ సంవ‌త్స‌రం ఎండ‌లు మండిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు ప్రాంతాల్లో గ‌రిష్టంగా 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్ర‌త న‌మోదైంది. ఈ ఎండ తీవ్ర‌త‌లు భ‌రించ‌లేక జ‌నం ఇళ్ల‌లోంచి బ‌య‌ట‌కి రావాలంటే జంకుతున్నారు. సార్వ‌త్రిక‌ ఎన్నిక‌ల కార‌ణంగా నేత‌ల‌కు మాత్రం ఎండ‌ల్లోనూ ప్ర‌చారం చేయాల్సి వ‌చ్చింది.

అయితే ఈ ఏడాది నైరుతి రుతుప‌వ‌నాలు మూడు రోజులు ముందుగానే చేరుకుంటున్నాయ‌ని వాతావ‌ర‌ణ శాస్త్ర‌జ్ఞులు తీపి క‌బురును తెలియ‌జేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు ఎండ‌ల నుంచి కాస్త ఉప‌శ‌మ‌నం ద‌క్కే చాన్స్ ఉంద‌ని వారు చెబుతున్నారు. 

Read Also టెండర్ ప్రక్రియ పూర్తి చేసి రోడ్డు పనులు ప్రారంభిస్తాం

 సాధారణంగా నైరుతి రుతుపవనాలు  దక్షిణ అండమాన్ సముద్రంలోకి ఏటా మే 22న ప్రవేశిస్తాయి. అక్క‌డి నుంచి వారం, పది రోజుల్లో కేరళను తాకుతాయి. ఈ ఏడాది నైరుతి మూడు రోజులు ముందే.. అంటే మే 19న దక్షిణ అండ మాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయ‌ని ఐఎండీ సోమవారం వెల్లడించింది.

Read Also ఆకేపోగు ప్రమోద్ కు 'దళిత రత్న' అవార్డు 

149 -2

Read Also ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి

ఆ త‌ర్వాత జూన్ 1వ తేదీలోగా కేరళకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది సానుకూల పరిణామమమే అని వారు పేర్కొంటున్నారు. కాగా రుతుపవనాలు కేరళకు సకాలంలో చేరుకోవాలంటే అరేబియా సముద్రంలో అనుకూల వాతావరణం ఉంటేనే సాధ్య‌మ‌వుతుంది.

Read Also రక్తపోటును అదుపులో పెట్టుకోవాలి

నైరుతి రుతుప‌వ‌నాల ఆగమనానికి ముందు అరేబియా సముద్రంలో అల్పపీడనం లేదా వాయు గుండం వంటివి ఏర్పడకూడదు. ఒక‌వేళ అలా ఏర్పడిన‌ట్ల‌యితే నైరుతి రుతుప‌వనాల రాక ఆల‌స్యం కానుంది. అయితే ఇప్పుడున్న పరి స్థితుల రీత్యా ఈ నెలాఖరులో అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు క‌న్పిస్తున్నాయ‌ని  వాతావరణ నిపుణులు స్ప‌ష్టం చేస్తున్నారు.

Read Also ప్రజావాణి అర్జీలు వెంటనే పరిష్కరించాలి

ఈ అంశంపై మ‌రికొన్ని రోజులైతే త‌ప్ప ఇప్ప‌డే స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేమ‌ని వారు చెబుతున్నారు. వాస్త‌వానికి గ‌త ఏడాది కూడా నైరుతి రుతుపవనాలు మే 19నే దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. అయితే ప్రతికూల పరిస్థితుల కార‌ణంగా జూన్ 8వ తేదీన చాలా ఆలస్యంగా కేరళను తాకాయి. ఒక‌వేళ జూన్ 1వ తేదీన నైరుతి రుతుప‌వ‌నాలు కేర‌ళ‌ను తాకితే అక్క‌డి నుంచి వారం రోజుల త‌ర్వాత తెలుగు రాష్ట్రాల‌కు చేరుకుంటాయి.

149 -3

కేర‌ళ తీరం తాకిన త‌ర్వాత ఈ రుతుప‌వ‌నాలు దేశంలోని అన్నిప్రాంతాల‌కు విస్త‌రిస్తాయి. త‌మిళ‌నాడు, రాయ‌ల‌సీమ ప్రాంతాల‌పై నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావం ఉండ‌దు. ఈ ప్రాంతాల్లో ఈశాన్య రుతుప‌వ‌నాల వల్ల వ‌ర్షాలు కురుస్తాయి. గ‌త ఏడాది రెండు వారాల పాటు నైరుతి రుతుప‌వ‌నాలు ఆల‌స్యంగా ప్ర‌వేశించాయి. దీంతో తెలుగు రాష్ట్రాల‌కు జూన్ ఆఖ‌రి వారంలో చేరాయి. 

నైరుతు రుతుప‌వ‌నాల వ‌ల్ల భార‌త్‌లో జూన్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు వ‌ర్షాలు కురుస్తాయి. ఈ రుతుప‌వ‌నాల‌పై లానినో, ఎల్‌నినో ప్ర‌భావం ఉండ‌డంతో అవి ఆల‌స్యం కావ‌డం, స‌క్ర‌మంగా వ‌ర్షాలు కుర‌వ‌క‌పోవ‌డం వంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సాధార‌ణ వ‌ర్ష‌పాతం కంటే అధికంగాను లేదా వ‌ర్షాభావ ప‌రిస్థితులు త‌లెత్త‌డం వంటి సంఘ‌ట‌న‌లు ఇటీవ‌ల అనేకంగా చోటు చేసుకుంటున్నాయి. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?