CM Revanth Reddy: కలిసికట్టుగా కరువును ఎదుర్కొందాం

ఆన్ లైన్ లో  ‘రైతు నేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: కలిసికట్టుగా కరువును ఎదుర్కొందాం

CM Revanth Reddy: హైదరాబాద్, క్విక్ టుడే : ఎన్ని క‌ష్టాలు ఎదురైనా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల‌కు అండగా నిలుస్తుంద‌ని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులున్నాయని, కలిసికట్టుగా కరువును ఎదుర్కొందామని ఆయ‌న‌ పిలుపునిచ్చారు. ఈ ఏడాది వర్షపాతం  త‌క్కువ‌గా ఉంద‌ని, రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటుతున్నాయని, అన్ని ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. రిజర్వాయర్ల నుంచి నీళ్లను విడుదల చేయాలని  నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్, ఖమ్మం  ప్రాంతంలోని రైతులు డిమాండ్ చేస్తున్నారని గుర్తుచేశారు. రైతులంతా ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలని విన్న‌వించారు. రాబోయే ఎండాకాలంలో తాగునీటికి కష్టాలు రాకుండా చూడాల్సిన అవసరముందన్నారు. అందుకోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేపట్టిన ‘రైతు నేస్తం’కార్యక్రమాన్నిసీఎం రేవంత్‌రెడ్డి బుధవారం తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ సెక్రెటరీ, కమిషనర్  రఘునందనరావు, డైరెక్టర్ గోపి,  రైతు సంఘాల ప్రతినిధులు సుంకెట అన్వేష్ రెడ్డి, నల్లమాల వెంకటేశ్వరరావు, వై వెంకటేశ్వరరావు సచివాలయం నుంచి పాల్గొన్నారు. ఆయా జిల్లాల నుంచి పలువురు రైతులు కాన్ఫరెన్స్ లో  పాల్గొని తాము పండిస్తున్న పంటల ద్వారా లాభాలు సాధిస్తున్న తీరుపై తమ అనుభవాలను పంచుకున్నారు.

66 -1

Read Also కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా పోరాడండి

తెలంగాణ‌లోని 2601 రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్‌ అనుసంధానం చేసి నేరుగా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. తొలి విడతగా ప్రయోగాత్మకంగా 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ఏర్పాటు చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివ‌ర్సిటీ సహకారంతో రూ.97 కోట్లతో రాష్ట్ర వ్యవసాయశాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. రైతు నేస్తం కార్య‌క్ర‌మం ద్వారా రాష్ట్రంలోని అధికారులు, వ్యవసాయ నిపుణులు నేరుగా గ్రామాల్లో, పంట పొలాల్లో ఉండే రైతులతో ముఖాముఖి మాట్లాడి వాళ్ల సమస్యలను తెలుసుకోవ‌చ్చు. పంటలకు సంబంధించిన సూచ‌న‌లు, సలహాలు, అధునాతన మెలకువలను ఎప్పటికప్పుడు అందించేందుకు వీలుంది.  ఆదర్శ రైతులు తమ అనుభవాలను ఇతర రైతులతో పంచుకోవ‌చ్చు. వీడియో కాన్ఫరెన్స్ లో చేపట్టిన ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. 

Read Also తెలుగు వృత్త్యంతర శిక్షణలో జ్ఞాన దర్శిని పుస్తక సమీక్ష

 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రతి సీజన్లో రైతులు ఎదుర్కునే సమస్యలను దృష్టిలో పెట్టుకొని, ఎప్పటికప్పుడు వాళ్లకు సలహాలు సూచనలిచ్చేందుకు రైతు నేస్తం ఉపయోగపడుతుందన్నారు. నేరుగా రైతులు వ్యవసాయ నిపుణులతో మాట్లాడేందుకు అవ‌కాశ‌ముంద‌న్నారు.  ప్రభుత్వమే ప్రజల దగ్గరికి వెళ్లాలని, అందులో భాగంగానే రైతుల సమస్యలను  తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. తమ ప్రభుత్వం రైతులతో కలిసి మెలిసి భవిష్యత్ కార్యక్రమాలను చేపడుతుందన్నారు. ఎరువులు, విత్తనాలు పంట వేయ‌డం మొదలు పండించిన పంట ఉత్పత్తులను అమ్ముకునేంత వరకు త‌మ‌ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. 

Read Also రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదు

66 -2

Read Also వ‌ర్షాకాలంలో అప్ర‌మ‌త్తంగా ఉండాలి..అధికారులు, క‌లెక్ట‌ర్ల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి

రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కాకుండా లాభసాటి ధర రావాలనే ఆలోచనతో త‌మ‌ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంద‌న్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతులకు విత్తనాలు అందుబాటులోకి తీసుకురావటం, మార్కెట్ యార్డులు, ఐకేపీ సెంటర్ల‌ ద్వారా ధాన్యం కొనుగోలు చేప‌డుతామ‌ని తెలిపారు. తెలంగాణలో 26 రకాల పంటలు పండటానికి అనుకూలమైన భూములు, వాతావరణం ఉందన్నారు. రైతులు కేవలం వరి లేదా పత్తి మిర్చి పంటలకే పరిమితం కావద్దని సీఎం సూచించారు. వ‌రి పంట బ‌దులు ఇతర పంటలు సాగు చేయాలని, దీని ద్వారా అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంద‌న్నారు. తక్కువ నీరు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడి, ఎక్కువ లాభాలు వచ్చే పంట‌ల‌ను సాగుచేయాల‌ని సూచించారు. 

Read Also ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి:-ఝాన్సీ రెడ్డి

రైతు నేస్తం కార్యక్రమాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని, దీంతో తమ సమస్యలను  ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ప్రస్తుతం 110 సెంటర్లలో ప్రయోగాత్మకంగా అమలు చేసిన ఈ కార్యక్రమాన్ని త్వ‌ర‌లోనే అన్ని గ్రామాలకు విస్తరిస్తామన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన సూచనలతో ప్రభుత్వం ఇటీవలే పంటల భీమా పథకాన్ని అమల్లోకి తెచ్చిందన్నారు. రైతులు ఏదైనా ప్ర‌మాదంలో చనిపోతే ఆ కుటుంబాన్ని రైతు బీమా పథకం ఆదుకుంటుందన్నారు.  రైతులు ధీమాగా బతికేందుకు పంటల బీమా ప‌థ‌కం ఉంటుంద‌న్నారు. పంట పెట్టుబడి పెట్టినప్పటి నుంచి కరువులు,  వరదలు వచ్చినా నష్టపరిహారం అందుతుందన్నారు. రైతు నేస్తం వ‌ల్ల‌ రైతులు ఆర్థికంగా చితికిపోయే పరిస్థితి ఉండదని తెలిపారు. ఎన్ని క‌ష్టాలు వ‌చ్చిన‌ రైతులు అధైర్య ప‌డొద్ద‌ని, ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు.

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?