MLC Kavitha : తిహార్ జైలుకు క‌విత‌.. 14 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ

MLC Kavitha : తిహార్ జైలుకు క‌విత‌.. 14 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ

MLC Kavitha : ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌, మ‌నీలాండ‌రింగ్ కేసులో అరెస్టు అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఈడీ విచార‌ణ మంగ‌ళ‌వారంతో ముగిసింది. ఈ నేప‌థ్యంలో ఆమెను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అరెన్యూ కోర్టులో హాజ‌రుప‌ర్చారు. ఈడీ త‌ర‌ఫు న్యాయవాది జోయబ్‌ హుస్సేన్ మ‌రో 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి  పంపాలని కోరారు.

ఆమె రిమాండ్ కాలంలో కవిత వాంగ్మూలాన్ని రికార్డ్ చేశామని, ఆమె విచారణలోప‌లువురు వ్యక్తులు, డిజిటల్ రికార్డులతో విచారించినట్లు ద‌ర్యాప్తు సంస్థ తెలిపింది. కేసు పురోగ‌తిలో ఉన్నందున మ‌రో 15 రోజులు జ్యుడీషియ‌ల్‌ రిమాండ్ అవ‌స‌రం అని తెలిపారు. అయితే ఆమె కుమారుడికి పరీక్షలు జరుగుతున్నాయని బెయిల్ మంజూరు చేయాలని క‌విత త‌ర‌ఫు న్యాయ‌వాది కోర్డు దృష్టికి తీసుకొచ్యారు.

Read Also ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి:-ఝాన్సీ రెడ్డి

ఇరువైపుల వాద‌న‌లు విన్న రౌస్ అవెన్యూ కోర్టు 14 రోజుల జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధిస్తున్న‌ట్లు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 9వ తేదీవ‌ర‌కు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ కొన‌సాగుతుందంటూ పేర్కొంది. ప్ర‌స్తుతం ఆమెను అధికారులు తిహార్ జైలుకు త‌ర‌లించ‌నున్నారు. అయితే ఏప్రిల్ 1వ తేదీన క‌విత మ‌ధ్యంత‌ర బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ కొన‌సాగ‌నుంది.

Read Also విద్యుత్ స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి

ఈనెల 15న కవితను అరెస్టు చేసి మరుసటి రోజు వీడి కష్టానికి తీసుకుంది మళ్లీ బుధవారం హైదరాబాదులోని కవిత నివాసంలో అదే రోజు హైదరాబాదు కవిత నివాసంలో సోదాలు నిర్వహించి అరెస్టు చేసినట్లు టిడిపి ప్రకటించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో కవిత వేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరించిన విషయం తెలిసిందే...

Read Also వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ఘనంగా స్వామి వారి ఇరవై వార్షికోత్సవం కార్యక్రమాలు

264 -2

Read Also హనుమాన్ జన్మనోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు

మెయిల్ పిటిషన్ రాల్కోటను ఆశ్రయించాలని గతంలోనే సుప్రీంకోర్టు తెలిపింది జస్టిస్ సంజీవ్ కన్నా జస్టిస్ నరేష్ జస్టిస్ వేలం ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం అందరికీ ఒకే విధమైన విధానాన్ని అనుసరిస్తారని రాజకీయ వ్యక్తులు ఎక్కువ ఏం కాదని బెయిల్ కోసం నేరుగా అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి అనుమతించలేము అని గతంలో కోరి

Read Also మద్దిమడుగు అంజన్న సన్నిధిలో సినీ హీరో అర్జున్ 

ఎమ్మెల్సీ క‌విత‌ను కోర్టు ముందు హాజ‌రుపర్చేందుకు ఈడీ అధికారులు తీసుకెళ్తున్న స‌మ‌యంలో ఆమె మీడియాతో ప‌లు విష‌యాలు మాట్లాడారు. త‌న‌పై మోపిన‌ది మ‌నీలాండ‌రింగ్ కేసు కాద‌ని పొలిటిక‌ల్ లాండ‌రింగ్ కేసు అని ఆరోపించారు. న‌న్ను తాత్కాలికంగా జైలులో పెట్ట‌వ‌చ్చు అని, నా ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ తీయ‌వ‌చ్చుగాని.. నేను క‌డిగిన ముత్యంలా బ‌య‌ట‌కి వ‌స్తాన‌ని అన్నారు.

త‌ప్పుడు కేసులు న‌మోదు చేస్తున్నార‌ని. ఈ కేసులో ఒక నిందితుడు ఇప్ప‌టికే బీజేపీలో చేరార‌ని, మ‌రో నిందితుడికి లోక్‌స‌భ టికెట్ ఇస్తున్నార‌ని, మ‌రో నిందితుడు బాండ్ల రూపంలో రూ.50 కోట్లు బీజేపీకి ఇచ్చిన‌ట్లు క‌విత ఆరోపించారు. జై తెలంగాణ‌.. జై కేసీఆర్ అంటూ ఆమె కోర్టులోకి వెళ్లారు. 

బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు కుమార్తె కవితను మార్చి 15న   హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి, అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ లో అరెస్టు చేశారు. ఆమెను మరుసటి రోజే ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజ‌రుప‌రిచి ఈడీ 7 రోజుల‌ కస్టడీకి అప్పగించిన విష‌యం తెలిసిందే.. 

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?