ప్రభుత్వ మైనార్టీ గురుకుల కళాశాల బదిలీ కొరకు కలెక్టర్ కు వినతిపత్రం

ప్రభుత్వ మైనార్టీ గురుకుల కళాశాల బదిలీ కొరకు కలెక్టర్ కు వినతిపత్రం

నల్లగొండ, మే 14 (క్విక్ టుడే న్యూస్):- నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని గుర్రంపోడ్ మండలానికి చెందిన పిట్టలగూడ గ్రామంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ మైనార్టీ గురుకుల కళాశాల, నియోజకవర్గం లో చాలా దూరంగా ఉండటంతో విద్యార్థులకు రాకపోకలలో తీవ్ర అసౌకర్యం కలుగుతోంది. పురాతన భవనం, తక్కువ మౌలిక వసతుల కారణంగా కళాశాలలో అడ్మిషన్లు పడిపోతున్నాయి. ఫలితంగా ప్రభుత్వ నిధుల వృథా జరుగుతున్నది. ఈ సమస్యపై స్పందించిన నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జిల్లా కలెక్టర్ కి ప్రత్యేక లేఖను రాసిన విషయం విదితమే. IMG-20250514-WA0042ఆ లేఖకు అధికారులు సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో, బుధవారం నాడు బీసీ సమాజ్ నేతృత్వంలో జిల్లా కలెక్టర్ ని కలిసిన బృందం ప్రత్యక్షంగా వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం బీసీ సమాజ్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డుపల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగింది. ప్రముఖ నాయకులు బుడిపాక సత్యనారాయణ, నిమ్మనగోటి సీనయ్య ఉన్నారు.

 *వినతిలో ప్రముఖంగా వివరించిన  అంశాలు* 

Read Also హబ్సిగూడలో లెక్డ వ‌స్త్రాల‌యం ప్రారంభించిన సినీ న‌టి అన‌న్య నాగ‌ళ్ల‌

పిట్టలగూడలోని కళాశాల భవనం చాలా పాతది, విద్యార్థులకు అసౌకర్యంగా ఉంది. రాకపోకలు కష్టంగా ఉండటంతో అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి. నాగార్జునసాగర్‌లో ఖాళీగా ఉన్న బీఈడీ కళాశాల భవనంలోకి, మైనార్టీ గురుకుల కళాశాలను బదిలీ చేయాలని విజ్ఞప్తి చెయ్యడం జరిగింది. బదిలీ జరిగితే విద్యార్థులకు సులభమైన రాకపోకలు, నాణ్యమైన మౌలిక వసతులు, అడ్మిషన్లు పెరిగే అవకాశం, పేద మైనార్టీ విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి రావడం, ప్రభుత్వ వనరుల సమర్థవంతమైన వినియోగం జరుగుతుంది. ఈ విజ్ఞప్తి పై కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. మరియు తగిన పరిశీలన చేసి మైనారిటీ గురుకుల హెచ్.ఓ.డీ కి లేఖ రాస్తామని  హామీ ఇచ్చినట్టు సమాచారం. ఇది విద్యా సమానత్వం కోసం బీసీ సమాజ్ ప్రారంభించిన ఉద్యమానికి కీలక ఘట్టం. ప్రతి విద్యార్థికి నాణ్యమైన భవిష్యత్ ఇవ్వాలన్న ఆత్మసంకల్పంతో బీసీ సమాజ్ ముందుంటుంది. అని బీసీ సమాజ్ ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డుపల్లి చంద్రశేఖర్ అన్నారు.

Read Also బ్రేకింగ్ న్యూస్.. ఘోర రోడ్డు ప్రమాదం... ఒకరు ఒకరు మృతి,పలువురికి గాయాలు 

Tags:

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?