Rythu bandhu scheme : రైతుబంధు పై కీలక నిర్ణయం.. కొత్త రూల్స్ తీసుకొచ్చిన సర్కార్ .. 

Rythu bandhu scheme : రైతుబంధు పై కీలక నిర్ణయం.. కొత్త రూల్స్ తీసుకొచ్చిన సర్కార్ .. 

Rythu bandhu scheme :  రైతుబంధు పథకం ఇంతకుముందు భూమి ఉన్న ప్రతి ఒక్కరికి వారి హోదా, ఉద్యోగ ఆదాయంతో పని లేకుండా చెల్లింపు చేసేవారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం సాగు చేసే రైతులకు మరియు కౌలు రైతులకు మాత్రమే రైతుబంధు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. గతంలో ఇచ్చిన పదివేలకు బదులు15వేలు ఇస్తామని ప్రకటించారు. అయితే పలు నిబంధనలు పెట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.

బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు పథకానికి కొనసాగింపుగా కాంగ్రెస్ తీసుకువచ్చిన రైతు భరోసా స్కీమ్ లో కీలక మార్పులు చేసేందుకు సర్కార్ రెడీ అవుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా రెండు నిబంధనలు తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. సాగు చేసే భూమిపై రైతుబంధు ఇవ్వటం సహా రాష్ట్రంలో నివాసం ఉండే వారికి మాత్రమే స్కీమ్ అమలు చేయాలని ప్రభుత్వం డిసైడ్ అయినట్లు తెలుస్తుంది..

Read Also శ్రీ గురు పీఠం ప్రాణ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక అందజేత

 బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు లేకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లు,రాళ్లు, రప్పలు, గుట్టలకు కేసీఆర్ సర్కార్ రైతుబంధు సాయం ఇస్తుందని, గతంలో కాంగ్రెస్ పార్టీ తో పాటు వివిధ పార్టీ నేతలు విమర్శలు చేశారు. గతంలో భూమి ఉంటే చాలు ఓనర్ ఎక్కడున్నా రైతుబంధు సాయం ప్రభుత్వం అందించేది. ఇప్పుడు ఆ నిబంధనలు కూడా మార్చనుంది ప్రభుత్వం.

Read Also ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి యశస్విని ఝాన్సీ రెడ్డిలు

242 -1

Read Also టెండర్ ప్రక్రియ పూర్తి చేసి రోడ్డు పనులు ప్రారంభిస్తాం

ఇక ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారికి,టాక్స్ కట్టే వారికి రైతుబంధు తొలగించాలన్న ప్రతిపాదనపైన చర్చ సాగుతుంది. అతి త్వరలోనే ఈ అంశంపై కూడా నిబంధనలు విడుదల చేసే ఆలోచనలో ఉంది రేవంత్ రెడ్డి సర్కార్. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరానికి 10వేలు అందించగా కాంగ్రెస్ మాత్రం ఎకరాకు ఏటా 15వేలు అందిస్తానని హామీ ఇచ్చింది. అదే విధంగా రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలతో పాలన కొనసాగిస్తున్నారు.

Read Also రెండు  కంచు గంటలు అందజేత

రైతుబంధు విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. గత ప్రభుత్వాలు పెద్ద పెద్ద భూస్వాములకు రైతుబంధు ఇస్తున్నట్లుగా విమర్శలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కోసం కఠినమైన విధివిధానాల పనిలో ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో అర్హులైన నిరుపేదలకు రైతుబంధు, పెట్టుబడి స‌హాయం అందించాల‌నేది సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు. 

Read Also లైసెన్స్ డ్ సర్వేయర్ల శిక్షణ కార్యక్రమంను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్

 కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచే రైతుబంధును 5 ఎకరాల పరిమితి విధించాలన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వం, ఆ మేరకే విధివిధానాలు సిద్ధం చేస్తుంది.  రైతు బంధు 5 ఎకరాల పరిమితి విధిస్తున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వాటికి బలాన్ని చేకూర్చాయి.

242 -3

దీంతో కేవలం 5 ఎకరాలు స్థలం ఉన్నవారికి మాత్రమే అది కూడా సాగు చేసే భూమికి మాత్రమే ఇవ్వాలని విధి విధానాలు తయారు చేస్తున్నట్లుగా సమాచారం. అంతేకాదు వ్యవసాయం పనులు మొదలయ్యే ముందు కాకుండా సీజన్ చివర్లో పంట సాయం అందించే ఆలోచన చేస్తున్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది.

ఇది ఇలా ఉండగా ఇప్పటికే 5ఎకరాల వరకు రైతు భరోసా నగదు అన్నదాతల అకౌంట్లో వేసినా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే దశలవారీగా జమ చేసింది. ఇప్పుడు ఎన్నికల కోడ్ నడవడం వల్ల ఎలక్షన్స్ పూర్తి అయిన వెంటనే రైతుబంధు కు సంబంధించిన కొత్త విధి విధానాలను ప్రకటిస్తున్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది..

Tags:

Related Posts

Join Us @ Social Media

Latest News

హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన  ఇంజనీర్.. ఏమైందంటే? హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు బలైన ఇంజనీర్.. ఏమైందంటే?
క్విక్ టుడే, న్యూస్ :-  ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి ఒక్కరికి కూడా ఒత్తిడి కారణంగా జుట్టు రాలుతున్న సమస్య ఉంది. ప్రతి 1000 మందిలోని వంద మందికి...
ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన మోడల్ కళాశాల పెబ్బేర్  
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగింపు!..
రజతోత్సవ బహిరంగ సభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు
CM Revanth Reddy: అవ‌స‌ర‌మైతే రోబోల సాయం తీసుకోండి
CM Revanth: మహిళా స్వయం సహాయక సంఘాలకు సౌర విద్యుత్ లో ప్రోత్సాహం
Travel: ఎంత‌ ఖ‌ర్చుపెట్టినా ఇండియాలో ఈ ప్రాంతాల‌ల్లో టూరిజానికి అవకాశం లేదు?